ETV Bharat / city

ఆదాయం తెచ్చే అమరావతిని నాశనం చేస్తున్నారు: నిమ్మల

author img

By

Published : Aug 6, 2020, 7:06 PM IST

సత్యం, ధర్మం తప్పడంవల్లే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు అన్నారు. లక్షల కోట్ల ఆదాయం తెచ్చే అమరావతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

tdp leader nimmala ramanaidu criticises ycp government on amaravathi issue
నిమ్మల రామానాయుడు

13 జిల్లాల రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఆదాయం వచ్చే అమరావతిని వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. 3 ముక్కలు చేయడం ద్వారా అమరావతిపై లక్షల కోట్ల ఆదాయాన్ని మాయం చేశారని ధ్వజమెత్తారు. విద్య, ఆరోగ్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా గత ప్రభుత్వం అమరావతిని రూపొందించిందని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డే అమరావతిని నిర్మిస్తారని చెప్పిన వారంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. చంద్రబాబు సవాల్​ను స్వీకరించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్థమైందన్నారు. సత్యం, ధర్మం తప్పడం వల్లే జగన్​ను ఓటమి భయం వెంటాడుతోందన్నారు.

ఇవీ చదవండి..

13 జిల్లాల రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఆదాయం వచ్చే అమరావతిని వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. 3 ముక్కలు చేయడం ద్వారా అమరావతిపై లక్షల కోట్ల ఆదాయాన్ని మాయం చేశారని ధ్వజమెత్తారు. విద్య, ఆరోగ్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా గత ప్రభుత్వం అమరావతిని రూపొందించిందని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డే అమరావతిని నిర్మిస్తారని చెప్పిన వారంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. చంద్రబాబు సవాల్​ను స్వీకరించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్థమైందన్నారు. సత్యం, ధర్మం తప్పడం వల్లే జగన్​ను ఓటమి భయం వెంటాడుతోందన్నారు.

ఇవీ చదవండి..

రాజంపేటలో శానిటైజర్ విక్రయ దుకాణాలపై నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.