ETV Bharat / city

వైద్యుల కుటుంబాలను ఆదుకోవాలని.. చంద్రబాబు లేఖ

author img

By

Published : Apr 22, 2020, 10:14 PM IST

కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు.

ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ
ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ
tdp leader chandrababu wrote a letter to govt about doctors
ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

కరోనా రోగులకు వైద్యం చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన వైద్యులు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు..

  • కరోనా బారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడే పోరాటంలో మృతి చెందిన వైద్యుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
  • చనిపోయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలి
  • ఆగస్ట్ 15, జనవరి 26 వంటి జాతీయ పర్వ దినాల్లో వారికి ప్రత్యేక పురస్కారాలు ఇచ్చి గౌరవించి సముచితంగా సత్కరించాలి
  • డాక్టర్లు, వైద్యసిబ్బందికి నాణ్యమైన రక్షణ ఉపకరణాలు(పీపీఈలు) ఇవ్వడంతో పాటు ప్రత్యేక ప్యాకేజి అదనంగా ప్రకటించాలి
  • కరోనా పోరులో డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి
  • కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల సేవలు చిరస్మరణీయం
  • వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాటం సాగిస్తున్నారు
  • వారికి అందరూ పూర్తిగా సహకరించాలి
  • ప్రాణదాతలుగా వారిని అందరూ గౌరవించాలి
  • యుద్దభూమిలో సైనికుల్లా డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా నుంచి పోరాడుతున్నారు
  • వారి సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

ఇదీ చూడండి కేంద్రమంత్రి జైశంకర్​కు చంద్రబాబు లేఖ.. కారణం ఇదీ..!

tdp leader chandrababu wrote a letter to govt about doctors
ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

కరోనా రోగులకు వైద్యం చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన వైద్యులు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు..

  • కరోనా బారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడే పోరాటంలో మృతి చెందిన వైద్యుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
  • చనిపోయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలి
  • ఆగస్ట్ 15, జనవరి 26 వంటి జాతీయ పర్వ దినాల్లో వారికి ప్రత్యేక పురస్కారాలు ఇచ్చి గౌరవించి సముచితంగా సత్కరించాలి
  • డాక్టర్లు, వైద్యసిబ్బందికి నాణ్యమైన రక్షణ ఉపకరణాలు(పీపీఈలు) ఇవ్వడంతో పాటు ప్రత్యేక ప్యాకేజి అదనంగా ప్రకటించాలి
  • కరోనా పోరులో డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి
  • కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల సేవలు చిరస్మరణీయం
  • వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాటం సాగిస్తున్నారు
  • వారికి అందరూ పూర్తిగా సహకరించాలి
  • ప్రాణదాతలుగా వారిని అందరూ గౌరవించాలి
  • యుద్దభూమిలో సైనికుల్లా డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా నుంచి పోరాడుతున్నారు
  • వారి సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

ఇదీ చూడండి కేంద్రమంత్రి జైశంకర్​కు చంద్రబాబు లేఖ.. కారణం ఇదీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.