ETV Bharat / city

తలనీలాల స్మగ్లింగ్​: 'దేవాదాయశాఖ మంత్రి ఇల్లు ముట్టడిస్తాం'

author img

By

Published : Mar 30, 2021, 6:30 PM IST

శ్రీవారి ఆలయంలో తలనీలాల స్మగ్లింగ్​ వ్యవహారంపై తెదేపా నేత బుచ్చిరాంప్రసాద్ మండిపడ్డారు. ఈ ఘటనపై 24 గంటల్లో సమగ్ర విచారణకు ఆదేశించకపోతే.. దేవాదాయశాఖ మంత్రి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.

ttd hair smuggling, buchi ramprasad warned government on hair smuggling
తితిదే తలనీలాల స్మగ్లింగ్, దేవాదాయశాఖ మంత్రి ఇల్లు ముట్టడిస్తామని బుచ్చి రాంప్రసాద్ హెచ్చరిక

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ ఆరోపణల​పై తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్ స్పందించారు. 24 గంటల్లో సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించకుంటే.. దేవాదాయశాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇంతవరకు మంత్రి విచారణకు ఆదేశించకపోవడాన్ని తప్పుపట్టారు.

వెంకన్నకు ఇచ్చిన తలనీలాలు ఎవరికి అమ్ముతున్నారో తితిదేకు తెలియకపోవడం దారుణమని రాంప్రసాద్ విమర్శించారు. తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అని తితిదే ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. తలనీలాలు స్మగ్లింగ్ జరుగుతుంటే పాలకమండలి ఏమి చేస్తోందని నిలదీశారు.

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ ఆరోపణల​పై తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్ స్పందించారు. 24 గంటల్లో సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించకుంటే.. దేవాదాయశాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇంతవరకు మంత్రి విచారణకు ఆదేశించకపోవడాన్ని తప్పుపట్టారు.

వెంకన్నకు ఇచ్చిన తలనీలాలు ఎవరికి అమ్ముతున్నారో తితిదేకు తెలియకపోవడం దారుణమని రాంప్రసాద్ విమర్శించారు. తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అని తితిదే ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. తలనీలాలు స్మగ్లింగ్ జరుగుతుంటే పాలకమండలి ఏమి చేస్తోందని నిలదీశారు.

సంబంధిత కథనం:

మయన్మార్​లో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదు: తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.