విజయవాడ నగరవాసుల చిరకాల వాంఛ త్వరలోనే తీరబోతోంది. బెంజ్ సర్కిల్ వద్ద పైవంతెన రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభించడానికి జాతీయ రహదారుల సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పైవంతెనను పరిశీలించారు. నోవాటెల్ హోటల్ నుంచి స్క్రూ వంతెన వరకూ ఉన్న పైవంతెనను కాలినడకన పరిశీలించారు. రెండో దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎంపీ కేశినేని నాని చెప్పారు.
ఇదీ చదవండి : సాక్షి దినపత్రికపై లోకేశ్ కేసు