ETV Bharat / city

''ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ఎప్పుడూ సిద్ధమే''

author img

By

Published : Jul 18, 2019, 3:17 AM IST

దక్షిణ భారత సింగపూర్ కాన్సులేట్ జనరల్ పోంగ్ కాక్ టియాన్.. బుధవారం సీఎస్ సుబ్రమణ్యంతో భేటీ అయ్యారు. సింగపూర్ ప్రతినిధులతో కలిసి సీఎస్​ను కలుసుకున్న టియాన్ పలు అంశాలపై చర్చించారు.

సీఎస్ సుబ్రమణ్యంతో సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ
సీఎస్ సుబ్రమణ్యంతో సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ

దక్షిణ భారతదేశంలో సింగపూర్ కాన్సులేట్ జనరల్​గా నియమితులైన పోంగ్ కాక్ టియాన్ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం, గతంలో సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్, స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్​తో కలసి పనిచేసేందుకు సింగపూర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎస్ సుబ్రమణ్యం.. సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. కాన్సులేట్ జనరల్​తో పాటు సింగపూర్​కు చెందిన ప్రతినిధుల బృందం ఈ భేటీకి హాజరైంది.

ఇదీ చదవండి : సిసోడియాతో సింగపూర్ కౌన్సిల్ జనరల్ భేటీ

సీఎస్ సుబ్రమణ్యంతో సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ

దక్షిణ భారతదేశంలో సింగపూర్ కాన్సులేట్ జనరల్​గా నియమితులైన పోంగ్ కాక్ టియాన్ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం, గతంలో సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్, స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్​తో కలసి పనిచేసేందుకు సింగపూర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎస్ సుబ్రమణ్యం.. సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. కాన్సులేట్ జనరల్​తో పాటు సింగపూర్​కు చెందిన ప్రతినిధుల బృందం ఈ భేటీకి హాజరైంది.

ఇదీ చదవండి : సిసోడియాతో సింగపూర్ కౌన్సిల్ జనరల్ భేటీ

Intro:Ap_cdp_46_17_esuka_kwary_taniki_Av_Ap10043
ఇసుక క్వారీల్లో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే సైన్ చేయలేదని జిల్లా కలెక్టర్ హరి కిరణ్ హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేట మండలం శేషమాంబాపురం లోని ఇసుక క్వారీని బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మార్గంలో వెళుతున్న ఇసుక ట్రాక్టర్లను నిలిపి క్వారీలో ఇసుక కోసం ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనే విషయాలను డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న రసీదును తీసుకున్నారు అనంతరం వారి వద్ద ఉన్న సాంకేతిక సిబ్బందిన్ని విచారించారు. అయితే ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల వద్ద తీసుకున్న రసీదులకు వారి వద్ద రికార్డులకు తేడా ఉండడంతో ఆయన ఆగ్రహం చేశారు. రికార్డులను సరి చేసిన తర్వాతనే క్వారీని తెరవాలని ఆదేశించారు. ఆర్టీవో నాగన్న డి.ఎస్.పి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.


Body:ఇసుక క్వారీల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.