RPF constable rescued woman : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధమైంది. రైలు కింద పడేందుకు వచ్చిన ఆమెను.. మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రెప్పపాటులో కాపాడింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో ఈనెల 7న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మోతీనగర్ వార్డుకు చెందిన యాదమ్మ(40) కుటుంబ కలహాలతో తీవ్ర ఆవేదనకు గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈనెల 7న మహబూబ్నగర్ రైల్వేస్టేషన్ వచ్చింది. ఏపీ నుంచి దిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్.. స్టేషన్కు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్మీదకు వెళ్లి నిలబడింది.
అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పూనమ్.. రెప్పపాటులో అప్రమత్తమై.. యాదమ్మను పక్కకు లాగేసింది. దీంతో.. ఆమె ప్రాణాలు నిలిచాయి. పట్టాలపై మహిళను గుర్తించిన లోకోపైలట్ అత్యవసర పరిస్థితిలో రైలును నిలిపేయడం కూడా కలిసి వచ్చింది.
అనంతరం.. యాదమ్మను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎస్ కానిస్టేబుల్ పూనమ్ను రైల్వే సిబ్బంది, అధికారులు అభినందించారు.
ఇదీ చూడండి: