రాజ్భవన్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఏడుగురు నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఉద్యోగాల పేరుతో నిందితులు డబ్బు వసూలు చేయగా... వీరిని విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పది మంది పొరుగుసేవల సిబ్బంది నుంచి రూ.21.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రోటోకాల్ విభాగం ఉద్యోగి సుశీల్... ఈ ఉదంతంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి-రాజ్భవన్ జాబ్ స్కాంలో ఏడుగురి అరెస్టు.. రూ. 21 లక్షలు స్వాధీనం