TTD Priests blessings: ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణలకు తితిదే వేద పండితులు శనివారం దిల్లీలో వేదాశీర్వచనం అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు కృష్ణశేషాచల దీక్షితులు ఆధ్వర్యంలో తిరుమల, శ్రీశైలం ఆలయాల వేద పండితులు రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల, శ్రీశైలం ఆలయాల తరపున శాలువతో.. వారిని సన్మానించారు.


ఇదీ చదవండి..
Priests blessings to PM Modi: ప్రధాని మోదీకి.. తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం