ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Jan 17, 2021, 5:13 PM IST

రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్​లో పేర్కొంది.

ap corona updates
రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,091 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 161 మందికి పాజిటివ్​గా తెలింది. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,985కు చేరింది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,140కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా 251 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో 8.76 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,896 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కోటీ 25 లక్షలకుపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు.

ap corona updates
రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా కేసులు

ఇదీ చూడండి:

దేశంలో మరో 15,144 మందికి కరోనా

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,091 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 161 మందికి పాజిటివ్​గా తెలింది. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,985కు చేరింది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,140కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా 251 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో 8.76 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,896 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కోటీ 25 లక్షలకుపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు.

ap corona updates
రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా కేసులు

ఇదీ చూడండి:

దేశంలో మరో 15,144 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.