ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా కేసులు.. రెండు మరణాలు నమోదు

author img

By

Published : Jan 27, 2021, 7:42 PM IST

రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

andhra pradesh corona cases updates
రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా కేసులు

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 111 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8, 87, 349కు చేరింది. ప్రస్తుతం 1,369 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో అనంతపూరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారని అధికారులు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్​తో మృతి చెందినవారి సంఖ్య 7,152కు చేరింది. 24 గంటల వ్యవధిలో 97 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో వైరస్ బారినుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 78 వేల 828కి పెరిగింది. ప్రకాశం, విజయనగరంల్లో ఇవాళ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

జిల్లాల వారిగా కేసులు...

అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19, చిత్తూరులో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 14, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 11, విశాఖపట్నం 11, కడపలో 8, అనంతపురంలో 8, కర్నూలులో 5, నెల్లూరులో 4, శ్రీకాకుళం ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీచూడండి: దేశంలో మరో 12,689 కరోనా కేసులు

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 111 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8, 87, 349కు చేరింది. ప్రస్తుతం 1,369 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో అనంతపూరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారని అధికారులు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్​తో మృతి చెందినవారి సంఖ్య 7,152కు చేరింది. 24 గంటల వ్యవధిలో 97 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో వైరస్ బారినుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 78 వేల 828కి పెరిగింది. ప్రకాశం, విజయనగరంల్లో ఇవాళ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

జిల్లాల వారిగా కేసులు...

అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19, చిత్తూరులో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 14, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 11, విశాఖపట్నం 11, కడపలో 8, అనంతపురంలో 8, కర్నూలులో 5, నెల్లూరులో 4, శ్రీకాకుళం ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీచూడండి: దేశంలో మరో 12,689 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.