వైద్య విద్య ప్రవేశాల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజర్వేషన్ కేటగిరి విద్యార్ధుల స్లైడింగ్కు సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు.
నేటి నుంచి 8 రోజుల వరకు విద్యార్ధులు ఆన్ లైన్లో తమ ధ్రువపత్రాలను పొందుపరచాలి. ఈనెల 13 నుంచి 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్ధులు అన్ లైన్లో తమ ధ్రువపత్రాలను పొందుపరుచుకోవచ్చని వర్శిటీ తెలిపింది. అనంతరం వాటిని పరిశీలించి వారం రోజుల్లోగా మెరిట్ ఆధారంగా కళాశాలలను కేటాయిస్తామని ఎన్టీఆర్ వర్శిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
రిజర్వేషన్ విద్యార్ధి ఓపెన్ కేటగిరి సీటు సంపాదించి స్లైడింగ్లో మరో కళాశాలను ఎంచుకుంటే ఖాళీ అయిన సీటును సంబంధిత రిజర్వేషన్ కేటగిరిలోని మెరిట్ అభ్యర్థికి కేటాయిస్తామని వీసీ తెలిపారు. మొదటి కౌన్సెలింగ్లో కోరుకున్న కాలేజీలో సీటు రాని విద్యార్ధులు నీట్కు వెళతారు. ప్రస్తుతం 18వ తేదీ వరకు నీట్ను పొడిగించారని మరో 15 రోజులు పొడిగించాలని ఎన్ఎంసీకి లేఖ రాసినట్లు వీసీ తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ అంతా ఆన్ లైన్లో చేయాలని వర్శిటీ అధికారులు నిర్ణయించారు. 17 వేల మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకునే అవకాశమున్నట్లు వర్శిటీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..