ETV Bharat / city

విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలలకు జగనన్న విద్యా దీవెన - జగనన్న విద్యా దీవెన తాజా వార్తలు

విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలలకు మాత్రమే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పరిమితం చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈ రెండు పథకాలు..ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన వారికి మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

jagananna vidyadevena is applicable only for universities and government pg colleges
విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలలకు జగనన్న విద్యా దీవెన
author img

By

Published : Dec 25, 2020, 7:43 PM IST

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను.. విశ్వవిద్యాలయ, ప్రభుత్వ పీజీ కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈ రెండు పథకాలు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో.. కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన వారికి మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వలు జారీ చేశారు.

కన్వీనర్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్​లో అడ్మిషన్లు పొందిన ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ రెండు పథకాలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ సీఎఫ్ఎస్ఎస్ సీఈఓకు సూచనలు జారీ చేసింది.

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను.. విశ్వవిద్యాలయ, ప్రభుత్వ పీజీ కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈ రెండు పథకాలు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో.. కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన వారికి మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వలు జారీ చేశారు.

కన్వీనర్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్​లో అడ్మిషన్లు పొందిన ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ రెండు పథకాలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ సీఎఫ్ఎస్ఎస్ సీఈఓకు సూచనలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.