ETV Bharat / city

Increasing crimes against women: స్త్రీలపై పెరిగిన వేధింపులు.. మహిళా సంఘాల ఆందోళన

author img

By

Published : Dec 30, 2021, 7:26 AM IST

Increasing crimes against women at AP: రాష్ట్రంలో మహిళలపై వేధింపులు గతేడాది కంటే 49 శాతం పెరగడంపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మహిళలు రావాలంటేనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం స్త్రీల రక్షణకు దిశ యాప్ తెచ్చినా.. పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

వేధింపులు పెరుగుదలపై మహిళా సంఘాల ఆందోళన
Increasing crimes against women
రాష్ట్రంలో మహిళలపై పెరిగిన వేధింపులు

Increasing crimes against women at AP: రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని నేరాల్లో మహిళలపై దాడులు అత్యధికంగా పెరిగాయని డీజీపీ విడుదల చేసిన వార్షిక నేర గణాంక నివేదిక చెబుతోంది. మహిళలపై వేధింపుల నేరాలు 49.04 శాతం ఎక్కువయ్యాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలూ 22.4 శాతం మేర పెరిగాయి. వరకట్న హత్యలు మాత్రమే తగ్గాయి. మహిళలపై అన్ని రకాల నేరాలు గతేడాది కన్నా ఈసారి 21 శాతం ఎక్కువయ్యాయి. ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో14 శాతం మహిళలపై నేరాలకు సంబంధించినవే ఉన్నాయి.

Increased harassment on women: గతేడాది 511 అత్యాచారాలు జరిగితే ఈసారి 536 జరిగాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు గతేడాది నమోదైన 5 వేల 225 నుంచి 2021లో 6 వేల 411కు పెరిగాయి. మొత్తంగా మహిళలపై వేధింపులకు సంబంధించి గతేడాది 6 వేల 319 కేసులు నమోదైతే ఈసారి 9 వేల 418 రికార్డయ్యాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 18 వందల 2 నుంచి 2 వేల 97కు పెరిగాయి.

ఫోన్ చేస్తే సరైన స్పందన లేదు..
Women's associations: మహిళలపై దాడులు పెరగటానికి మద్యం, గంజాయే ప్రధాన కారణమని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. మహిళలను వేధిస్తే కఠిన శిక్షలని చెప్పడమేగానీ అమలు కావడంలేదని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫోన్ చేస్తే సరైన స్పందన లేదంటున్నారు.

ఇదీ చదవండి..

Omicron Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

రాష్ట్రంలో మహిళలపై పెరిగిన వేధింపులు

Increasing crimes against women at AP: రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని నేరాల్లో మహిళలపై దాడులు అత్యధికంగా పెరిగాయని డీజీపీ విడుదల చేసిన వార్షిక నేర గణాంక నివేదిక చెబుతోంది. మహిళలపై వేధింపుల నేరాలు 49.04 శాతం ఎక్కువయ్యాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలూ 22.4 శాతం మేర పెరిగాయి. వరకట్న హత్యలు మాత్రమే తగ్గాయి. మహిళలపై అన్ని రకాల నేరాలు గతేడాది కన్నా ఈసారి 21 శాతం ఎక్కువయ్యాయి. ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో14 శాతం మహిళలపై నేరాలకు సంబంధించినవే ఉన్నాయి.

Increased harassment on women: గతేడాది 511 అత్యాచారాలు జరిగితే ఈసారి 536 జరిగాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు గతేడాది నమోదైన 5 వేల 225 నుంచి 2021లో 6 వేల 411కు పెరిగాయి. మొత్తంగా మహిళలపై వేధింపులకు సంబంధించి గతేడాది 6 వేల 319 కేసులు నమోదైతే ఈసారి 9 వేల 418 రికార్డయ్యాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 18 వందల 2 నుంచి 2 వేల 97కు పెరిగాయి.

ఫోన్ చేస్తే సరైన స్పందన లేదు..
Women's associations: మహిళలపై దాడులు పెరగటానికి మద్యం, గంజాయే ప్రధాన కారణమని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. మహిళలను వేధిస్తే కఠిన శిక్షలని చెప్పడమేగానీ అమలు కావడంలేదని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫోన్ చేస్తే సరైన స్పందన లేదంటున్నారు.

ఇదీ చదవండి..

Omicron Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.