నగదు రశీదు లేకుండా బంగారు ఆభరణాలను రవాణా చేస్తున్న నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1.7 కిలోల బంగారం, 1.4 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్, మధ్యప్రదేశ్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ నగరానికి బంగారాన్ని తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బందరు లాకుల వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తుండగా.. వీరి వద్ద బిల్లులు లేకుండా ఉన్న బంగారు ఆభరణాలను గుర్తించారు. బిల్లులు చూపకపోవటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితులను ఐటీ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: డబ్బా మూత మింగిన చిన్నారి.. కాపాడిన వైద్యులు