రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు నిప్పులు చెరిగారు. ఉదయం లేచినప్పటినుంచి తెదేపా నాయకులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసే విజయసాయి... సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని దేవినేని మండిపడ్డారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వైకాపా ఎంపీలు కేంద్ర విదేశాంగ మంత్రి చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. చరిత్రలో నిలిచిపోయేలా గత ఐదేళ్లలో పోలవరం నిర్మాణ పనులు చేపడితే... వైకాపా నేతలు విమర్శిచడం సిగ్గుచేటన్నారు. వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్లే బందరు పోర్టు పనులు చేసే యంత్రాలు వెనక్కివెళ్లాయని కొల్లు రవీంద్ర విమర్శించారు. బందరు పోర్ట్ పై ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవో లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి