ETV Bharat / city

'మాపై అక్రమంగా కేసు పెట్టారు'..హైకోర్టులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పిటిషన్

author img

By

Published : Feb 23, 2022, 4:36 PM IST

తమపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు, భర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు అక్రమంగా తమపై కేసు నమోదు చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్తానం 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు, భర్త హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. తమపై అన్యాయంగా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

41 ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు, భర్త హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. తమపై అన్యాయంగా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

41 ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి

DEMOLISH: ఆళ్లగడ్డలో బస్‌షెల్టర్‌ కూల్చివేత వివాదం..విఖ్యాత రెడ్డి నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.