ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ ఏడో తేది నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Aug 31, 2021, 12:26 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ తేదీలను వైదిక కమిటీ ఖరారు చేసింది. అక్టోబరు ఏడో తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో డి.భ్రమరాంబ తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ ఏడో తేది నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ ఏడో తేది నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ తేదీలను వైదిక కమిటీ ఖరారు చేసింది. అక్టోబరు ఏడో తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. అక్టోబరు ఏడో తేదీ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజున జగజ్జననీ లోకమాత కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఎనిమిదో తేదీ బాలా త్రిపురసుందరీదేవిగా, తొమ్మిదో తేదీన గాయత్రీదేవిగా, పదో తేదీ లలితా త్రిపురసుందరీదేవిగా, 11వ తేదీ ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణదేవిగా, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది గంటల వరకు మహలక్ష్మిదేవిగా దర్శనమిస్తారు. అక్టోబరు 12న సరస్వతిదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.

అదేరోజున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 13వ తేదీన దుర్గాదేవిగా, 14న మహిషాశుర మర్దినిగా, 14 న రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారిని అలంకరిస్తారని ఈవో పేర్కొన్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ తేదీలను వైదిక కమిటీ ఖరారు చేసింది. అక్టోబరు ఏడో తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. అక్టోబరు ఏడో తేదీ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజున జగజ్జననీ లోకమాత కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఎనిమిదో తేదీ బాలా త్రిపురసుందరీదేవిగా, తొమ్మిదో తేదీన గాయత్రీదేవిగా, పదో తేదీ లలితా త్రిపురసుందరీదేవిగా, 11వ తేదీ ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణదేవిగా, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది గంటల వరకు మహలక్ష్మిదేవిగా దర్శనమిస్తారు. అక్టోబరు 12న సరస్వతిదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.

అదేరోజున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 13వ తేదీన దుర్గాదేవిగా, 14న మహిషాశుర మర్దినిగా, 14 న రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారిని అలంకరిస్తారని ఈవో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

వచ్చే నెల 1, 2 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.