రాష్ట్రంలో దాడులు, దేవుళ్ళ విగ్రహాలు విధ్వంసమవుతుంటే..సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఆలయాలపై దాడులకు రాజకీయాలతో సంబంధం లేదని..ఉన్మాదులు, పిచ్చోళ్ళ పని అని ప్రకటించిన డీజీపీ...రెండో రోజు మాట మార్చి ప్రతిపక్షాలకు ఈ దాడులను అంటగడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ డైరెక్షన్లో డీజీపీ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
దాడులను ఆపలేక తెదేపా నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రామతీర్థం ఉదంతంలో తెదేపా సానుభూతిపరుడు సూరిబాబును ఇరికించి భౌతికంగా హింసించారన్నారు. రైతు భరోసా కేంద్రాలు బోగస్ అని.. రైతు ధాన్యం అమ్ముకోవాలంటే పర్మిషన్లు కావాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదీచదవండి