సినీ నటుడు మోహన్ బాబుపై దాసరి నారాయణరావు కోడలు సుశీల మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత పసుపు-కుంకుమ ఎందుకు ఇచ్చారు అన్న వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంగతి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. కష్టకాలంలోనూ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. చంద్రబాబు ప్రజల అభివృద్ధి కోసం ఎన్నికల్లో దిగారని... మరిమోహన్ బాబు ఎవరి సంక్షేమం కోసం వైకాపాలో చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైటెక్ సిటీలా మంగళగిరిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని సుశీల అన్నారు.
ఇవీ చూడండి.
దేవినేని దండయాత్రా?... వసంత విజయయాత్రా?