బడ్జెట్పై శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగలేదు కాబట్టి అన్ని రంగాలలో అభివృద్ధి, సంక్షేమంపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయం, నీటి పారుదల రంగానికి సంబంధించి వాస్తవాలను బహిర్గతం చేయాలన్నారు. శాసనసభ, శాసనమండలి జరుగుతున్న తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. మండలి వీడియో ఫుటేజ్ను బయటపెట్టాలన్నారు.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్డించుకోవడం లేదని విమర్శించారు. ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.