ETV Bharat / city

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. కరోనా నిరోధక చర్యలపై చర్చ

author img

By

Published : Mar 30, 2020, 6:38 PM IST

Updated : Mar 31, 2020, 3:08 AM IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజ్​భవన్​లో ముఖ్యమంత్రి జగన్ కలిశారు. అరగంటపాటు వీరి భేటీ కొనసాగింది. లాక్‌డౌన్‌ పరిస్థితులు, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై చర్చించనట్లు సమాచారం.

Cm jagan Meet Governor
రాష్ట్ర గవర్నర్​ను కలిసిన సీఎం జగన్
గవర్నర్​తో సీఎం జగన్ భేటీ

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాజ్​భవన్​లో అరగంట పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై గవర్నర్​తో సీఎం జగన్ చర్చించారు. లాక్​డౌన్ వల్ల రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులు వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్​కు సీఎం వివరించినట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్​కు సీఎం జగన్ వివరించారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం పట్టణాల్లో సమయం కుదింపు సహా వైద్య సదుపాయాల కల్పన, పేదలకు నిత్యావసరాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను గవర్నర్​కు సీఎం తెలిపారు.

రాజ్​భవన్ లోపలికి సీఎం వాహనం మాత్రమే

కరోనా ప్రభావం సీఎం కాన్వాయ్​ పైనా పడింది. సాధారణంగా రాజ్​భవన్​కు ముఖ్యమంత్రి వెళ్లినపుడు సీఎం కాన్వాయ్ మొత్తాన్ని రాజ్​భవన్ లోపలికి పంపుతారు. కరోనా ప్రభావంతో రాజ్​భవన్​లో అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈసారి సీఎం జగన్ వాహనాన్ని మాత్రమే లోపలికి పంపారు. మిగిలిన వాహనశ్రేణిని రాజ్​భవన్ గేటు బయట నిలిపివేశారు. 108 వాహనం, ఎస్కార్ట్, సహా కాన్వాయ్​లోని మిగిలిన అధికారులంతా సీఎం వచ్చే వరకు రాజ్​భవన్ బయట వేచిఉన్నారు.

ఇవీ చదవండి:

బాలింత అయినా... బాధ్యత మరువలేదు..!

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాజ్​భవన్​లో అరగంట పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై గవర్నర్​తో సీఎం జగన్ చర్చించారు. లాక్​డౌన్ వల్ల రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులు వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్​కు సీఎం వివరించినట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్​కు సీఎం జగన్ వివరించారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం పట్టణాల్లో సమయం కుదింపు సహా వైద్య సదుపాయాల కల్పన, పేదలకు నిత్యావసరాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను గవర్నర్​కు సీఎం తెలిపారు.

రాజ్​భవన్ లోపలికి సీఎం వాహనం మాత్రమే

కరోనా ప్రభావం సీఎం కాన్వాయ్​ పైనా పడింది. సాధారణంగా రాజ్​భవన్​కు ముఖ్యమంత్రి వెళ్లినపుడు సీఎం కాన్వాయ్ మొత్తాన్ని రాజ్​భవన్ లోపలికి పంపుతారు. కరోనా ప్రభావంతో రాజ్​భవన్​లో అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈసారి సీఎం జగన్ వాహనాన్ని మాత్రమే లోపలికి పంపారు. మిగిలిన వాహనశ్రేణిని రాజ్​భవన్ గేటు బయట నిలిపివేశారు. 108 వాహనం, ఎస్కార్ట్, సహా కాన్వాయ్​లోని మిగిలిన అధికారులంతా సీఎం వచ్చే వరకు రాజ్​భవన్ బయట వేచిఉన్నారు.

ఇవీ చదవండి:

బాలింత అయినా... బాధ్యత మరువలేదు..!

Last Updated : Mar 31, 2020, 3:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.