ETV Bharat / city

వైకాపా పథకాలన్నీ.. కొత్త సీసాలో పాత సారాలాంటివి: చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. నోరు తెరిస్తే అబద్దం, రోజుకో నాటకం, మాట తప్పి, మడమ తిప్పడమే పని అన్నారు. దేవాలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Sep 8, 2020, 4:40 PM IST

chandrababu naidu comments on ysrcp govt over welfare scheemes
chandrababu naidu comments on ysrcp govt over welfare scheemes

దేవాలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో అకృత్యాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే అందుకు ప్రత్యక్ష సాక్యమన్నారు. తెదేపా సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివేనని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని ఆక్షేపించారు. 0.25శాతం అప్పు పరిమితి కోసం 18లక్షల రైతుల జీవితాలతో చెలగాటం చేస్తున్నారని మండిపడ్డారు.

వైకాపా దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి టాప్ ర్యాంక్ తెదేపా తెస్తే... పారిశ్రామిక వేత్తలను బెదిరించి, వైకాపా ప్రభుత్వం టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందని ధ్వజమెత్తారు. కియా రావడం వైకాపాకి ఇష్టం లేదన్నారు. వైకాపా బెదిరింపుల వల్లే కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో దళితులపై దాడులు జరగని రోజు లేదని చంద్రబాబు మండిపడ్డారు. దళితుల ఇళ్లు తగులపెట్టడం, సజీవ దహనానికి యత్నం, శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్ రేప్ లు, వైకాపా ఆకృత్యాలకు లెక్కేలేదని దుయ్యబట్టారు. దళితులపై వైకాపా దమనకాండ గురించి దేశవ్యాప్తంగా ఎండగట్టాలని నేతలకు సూచించారు. ప్రతి జిల్లాలో వైకాపా బాధిత దళిత కుటుంబాలకు అండగా ఉండాలని చంద్రబాబు తెలిపారు. వైకాపా అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ‘'పసుపు చైతన్యం' 100రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

దేవాలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో అకృత్యాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే అందుకు ప్రత్యక్ష సాక్యమన్నారు. తెదేపా సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివేనని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని ఆక్షేపించారు. 0.25శాతం అప్పు పరిమితి కోసం 18లక్షల రైతుల జీవితాలతో చెలగాటం చేస్తున్నారని మండిపడ్డారు.

వైకాపా దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి టాప్ ర్యాంక్ తెదేపా తెస్తే... పారిశ్రామిక వేత్తలను బెదిరించి, వైకాపా ప్రభుత్వం టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందని ధ్వజమెత్తారు. కియా రావడం వైకాపాకి ఇష్టం లేదన్నారు. వైకాపా బెదిరింపుల వల్లే కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో దళితులపై దాడులు జరగని రోజు లేదని చంద్రబాబు మండిపడ్డారు. దళితుల ఇళ్లు తగులపెట్టడం, సజీవ దహనానికి యత్నం, శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్ రేప్ లు, వైకాపా ఆకృత్యాలకు లెక్కేలేదని దుయ్యబట్టారు. దళితులపై వైకాపా దమనకాండ గురించి దేశవ్యాప్తంగా ఎండగట్టాలని నేతలకు సూచించారు. ప్రతి జిల్లాలో వైకాపా బాధిత దళిత కుటుంబాలకు అండగా ఉండాలని చంద్రబాబు తెలిపారు. వైకాపా అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ‘'పసుపు చైతన్యం' 100రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

పుట్టెడు కష్టం.. సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.