ETV Bharat / city

CBn Condolence: 'జైన్ నాదెళ్ల మరణవార్త తమను ఎంతగానో కలచివేసింది' - జైన్ నాదెళ్ల మృతిపట్ల చంద్రబాబు సంతాపం

Chandrababu on Satya Nadella son died: మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేశ్​ సంతాపం ప్రకటించారు. జైన్ నాదెళ్ల మరణవార్త తెలిసి తాను చాలా బాధపడ్డానని చంద్రబాబు అన్నారు.

chandrababu and lokesh condolence
chandrababu and lokesh condolence
author img

By

Published : Mar 1, 2022, 4:44 PM IST

Chandrababu: మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మరణవార్త తెలిసి చాలా బాధపడ్డానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జైన్ నాదెళ్ల మరణవార్త తనను ఎంతగానో కలచి వేసిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్​ అన్నారు. సత్యనాదెళ్ల కుటుంబ సభ్యులకు.. చంద్రబాబు,లోకేశ్​ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నామన్నారు. ఈమేరకు చంద్రబాబు ట్వీట్టర్​ వేదికగా ట్వీట్​ చేశారు.

  • Deeply pained to learn of the passing away of young Zain Nadella. Condolences to Anupama Ji, @satyanadella and family. May god give them strength through this difficult time. Om Shanthi.

    — N Chandrababu Naidu (@ncbn) March 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జైన్ నాదెళ్ల(26) మృతి

Satya Nadella son died: మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్​ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్​ పాల్జీ) బాధపడుతున్నాడు. జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్​ ఎక్జిక్యూటివ్​ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.

Zain Nadella News: 2014లో మైక్రోసాఫ్ట్​ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్​ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు.

ఇదీ చదవండి: సత్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం- 26 ఏళ్ల కుమారుడు కన్నుమూత

Chandrababu: మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మరణవార్త తెలిసి చాలా బాధపడ్డానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జైన్ నాదెళ్ల మరణవార్త తనను ఎంతగానో కలచి వేసిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్​ అన్నారు. సత్యనాదెళ్ల కుటుంబ సభ్యులకు.. చంద్రబాబు,లోకేశ్​ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నామన్నారు. ఈమేరకు చంద్రబాబు ట్వీట్టర్​ వేదికగా ట్వీట్​ చేశారు.

  • Deeply pained to learn of the passing away of young Zain Nadella. Condolences to Anupama Ji, @satyanadella and family. May god give them strength through this difficult time. Om Shanthi.

    — N Chandrababu Naidu (@ncbn) March 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జైన్ నాదెళ్ల(26) మృతి

Satya Nadella son died: మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్​ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్​ పాల్జీ) బాధపడుతున్నాడు. జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్​ ఎక్జిక్యూటివ్​ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.

Zain Nadella News: 2014లో మైక్రోసాఫ్ట్​ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్​ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు.

ఇదీ చదవండి: సత్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం- 26 ఏళ్ల కుమారుడు కన్నుమూత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.