ETV Bharat / city

Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా'

author img

By

Published : Jul 17, 2021, 12:09 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నేత బచ్చుల అర్జునుడిని పరామర్శించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని అన్నారు.

chandra babu on central gazette on water projects in ap
chandra babu on central gazette on water projects in ap
chandra babu on central gazette on water projects in ap

ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బచావత్ ట్రైబ్యునల్‌, గెజిట్‌కు వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని చెప్పారు. వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని.. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బాధ్యత లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడుతుందని తేల్చిచెప్పారు.

విజయవాడ రమేష్ ఆసుపత్రిలో పార్టీ నేత బచ్చుల అర్జునుడుని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబుతో పాటు ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో బచ్చుల అర్జనుడు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక గుండెపోటు రావడంతో హుటాహుటిన విజయవాడ రమేష్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. యాంజియో ప్లాస్టీ సర్జరీ వైద్యులు చేశారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని చంద్రబాబుకు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

WATER DISPUTES: ఇక వివాదాలు తేల్చాల్సింది ట్రైబ్యునలే!

chandra babu on central gazette on water projects in ap

ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బచావత్ ట్రైబ్యునల్‌, గెజిట్‌కు వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని చెప్పారు. వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని.. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బాధ్యత లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడుతుందని తేల్చిచెప్పారు.

విజయవాడ రమేష్ ఆసుపత్రిలో పార్టీ నేత బచ్చుల అర్జునుడుని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబుతో పాటు ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో బచ్చుల అర్జనుడు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక గుండెపోటు రావడంతో హుటాహుటిన విజయవాడ రమేష్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. యాంజియో ప్లాస్టీ సర్జరీ వైద్యులు చేశారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని చంద్రబాబుకు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

WATER DISPUTES: ఇక వివాదాలు తేల్చాల్సింది ట్రైబ్యునలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.