రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ను వేగంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఎయిర్ ఫోర్సు విమానాలను వినియోగిస్తోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పూర్తిస్థాయిలో తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఒడిశాలోని ఆంగుల్లో టాటా స్టీల్, జిందాల్ స్టీల్ ప్లాంట్ల నుంచి కేటాయించిన 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను రాష్ట్రానికి రప్పించేందుకు... విజయవాడ, గన్నవరం విమానాశ్రయం నుంచి రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారు.
ఇదీ చదవండి:
పరీక్షలు వాయిదా వేయాలని.... హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ మౌనదీక్ష