విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అమరావతి నగర్లో ఓ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. 48 లక్షల 44 వేల రూపాయలు తనిఖీల్లో బయటపడినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆ ఇంటి యజమాని వెల్డింగ్ పనులు చేస్తుంటాడని.. అంత డబ్బులు ఎలా వచ్చాయనే దానిపై వివరాలు అడిగినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: తెదేపా కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి