ETV Bharat / city

పెరుగుతున్న ప్రేమోన్మాద దాడులు.. మూడు నెలల్లో ఏడు దారుణాలు

author img

By

Published : Jan 25, 2021, 8:12 AM IST

ప్రేమంటారు.. వెంటపడతారు.. వేధిస్తారు.. కాదంటే కత్తి దూస్తున్నారు. ఈ తరహా ఉన్మాదం రాష్ట్రంలో ఇటీవల పెరిగింది. మూణ్నెల్లలో ఐదు ఉదంతాల్లో నలుగురు యువతులు బలైపోయారు. అనుకున్నది దక్కకపోతే ఎంతకైనా తెగించాలనే తీవ్ర మనస్తత్వం ఉన్న యువకుల ప్రవర్తన ఈ దారుణాలకు దారితీస్తోంది. తాము చేస్తున్నది నేరమని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిసీ.. కొంతమంది తెగిస్తున్నారు. ఫలితంగా అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయి విగతజీవిగా మారిపోతే.. ఆ తల్లిదండ్రులకు అంతులేని విషాదం మిగిలిపోతుంది. ఉన్మాదుల కుటుంబాల్లోనూ సంక్షోభం చెలరేగుతోంది.

పెరుగుతున్న ప్రేమోన్మాద దాడులు.. మూడు నెలల్లో ఏడు దారుణాలు
పెరుగుతున్న ప్రేమోన్మాద దాడులు.. మూడు నెలల్లో ఏడు దారుణాలు

ముసుగు తొలగిన తర్వాతే..

చాలామంది అమ్మాయిలు తెలిసీ తెలియని దశలో, కౌమార వయసులో ఆకర్షణలకు లోనవుతున్నారు. అవతలి వ్యక్తి మనస్తత్వం, ప్రవర్తనపై సరైన అంచనా, అవగాహన లేకుండానే వారి వలలో చిక్కుకుంటున్నారు. యువకులు మొదట్లో సున్నితంగా ఉంటూ, మంచి మాటలతో అమ్మాయిలతో చనువు పెంచుకుంటున్నారు. కొన్నాళ్లకు వారి ముసుగు తొలగి అసలు స్వభావం బయటపడేకొద్దీ.. అమ్మాయిలు నెమ్మదిగా దూరం పెడుతున్నారు. మంచీచెడులు అర్థం చేసుకునే పరిణితి రావడం, కెరీర్‌పై దృష్టి సారించే క్రమంలో వారి ఉచ్చులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలోనే యువకుల్లోని విపరీతగుణం వెలుగుచూస్తోంది. అప్పటివరకూ తనతో బాగా మెలిగిన అమ్మాయి దూరం పెడుతుండటంతో.. కక్ష పెంచుకుంటున్నారు. ఇతరులతో చనువుగా ఉంటుందేమోనని అపోహ పడుతున్నారు. పగతో రగిలిపోతూ వేధింపులకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. చంపేయాలన్నంత కసి పెంచుకొంటున్నారు. తాను మారిపోయానంటూ, చివరిసారి మాట్లాడేందుకు బయటకు రావాలంటూ నమ్మిస్తున్నారు. తమ మధ్య సంబంధాలు బాగా ఉన్నప్పటి ఫోన్‌ సంభాషణలు, తీసుకున్న చిత్రాలు భద్రపరుచుకుని.. తాను పిలిచిన చోటుకు రాకపోతే వాటిని బయటపెడతానంటూ బెదిరిస్తున్నారు. పరువు, భయంతో బయటకొచ్చిన యువతిని.. చివరకు ఘర్షణకు దిగి చంపేస్తున్నారు.

ఆ ఆలోచనే వారికి అలుసవుతోంది...

ప్రేమోన్మాదుల వేధింపుల సమస్యను తొలుత వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనను అవతలి వారు అలుసుగా తీసుకుంటున్నారు. అమ్మాయి భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతుందనో.. పరువు పోతుందనో.. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు వెనకాడుతున్నారు. దీంతో తమను ఏమీ చేయలేరులే అనే భావనతో అవతలి వారు రెచ్చిపోతున్నారు. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారి నుంచి సత్వర స్పందన లోపిస్తోంది. ఇటీవలి ఉదంతాలే ఇందుకు తార్కాణాలు.

4 నెలలు.. 7 ఉదంతాలు

1. చిత్తూరు జిల్లాలో గాయత్రి అనే యువతిని ఢిల్లీబాబు అనే యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిరువురూ నెలన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు. పెద్దలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడికి పెళ్లి వయసు రాకపోవటంతో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు. ఆ తర్వాత నుంచి గాయత్రి మనసు మార్చుకుని తనను దూరం పెడుతోందని.. ఆమె తల్లిదండ్రుల మాటే వింటూ.. తనను తిరస్కరిస్తోందని భావించిన ఢిల్లీబాబు పగ పెంచుకుని ఉన్మాదిగా మారాడు. కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. చివరికి అతనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.

2. విజయవాడలో దారుణ హత్యకు గురైన ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్వినికి నాగేంద్రబాబు నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అతని వల్ల తన కుటుంబ సభ్యులకు ఏమైనా హాని కలుగుతుందేమోనన్న భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చివరకు ఆ యువకుడు.. యువతి ఇంట్లోకి చొరబడి గొంతు కోసి చంపేశాడు. తానూ కత్తితో గాయపరుచుకున్నాడు.

3. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో సజీవ దహనమైంది. యువకుడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరోసారి ఆమె జోలికి వెళ్లనంటూ రాసిచ్చాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే చిన్నారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హతమార్చాడు. ఆ మంటల్లో తానూ మరణించాడు.

4. విశాఖ జిల్లా గాజువాకలో అఖిల్‌సాయి అనే యువకుడు తన కుమార్తె వెంట పడుతున్నాడంటూ యువతి తండ్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి భవిష్యత్తు పాడైపోతుందంటూ నిందితుడి తండ్రి యువతి తండ్రిని బతిమాలాడు. మీ కుమార్తె జోలికి రాకుండా చూసుకుంటానని హామీ ఇవ్వటంతో యువతి తండ్రి ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయినా ఆ ప్రేమోన్మాది ఆమె గొంతుకోసి హతమార్చాడు.

5. ఇదే జిల్లాలో వార్డు వాలంటీరుగా పనిచేస్తున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో శ్రీకాంత్‌ అనే యువకుడు ఆమె ఇంటికెళ్లి మరీ గొంతు కోశాడు. తానూ గాయపరచుకున్నాడు. ఆసుపత్రిలో చేర్చడంతో బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది.

6. అనంతపురం జిల్లాలో ఇటీవల హత్యకు గురైన స్నేహలత తల్లిదండ్రులు.. రాజేశ్‌ అనే యువకుడి వేధింపులపై గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌ కూడా వారుంటున్న కాలనీవాసే కావటంతో.. ‘మీరు అక్కడి నుంచి ఇల్లు మారితే సమస్య ఉండదు కదా’ అంటూ పోలీసులు సలహా ఇచ్చారు. చివరకు ప్రేమోన్మాదిగా మారిన రాజేశ్‌.. స్నేహలత గొంతు నులిమి చంపేశాడు

7. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ఉన్మాది.. తనను ప్రేమించలేదని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటనలో ఆమె ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపోగా తల, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చెర నుంచి బయటకొచ్చినా...

ప్రేమ పేరిట వేధింపులు ఎదుర్కొంటున్న అమ్మాయిల్లో కొందరు మాత్రమే ఆ విషయాన్ని కుటంబ సభ్యులతో చెప్పగలుగుతున్నారు. ఇంట్లో తెలిస్తే తమనే తప్పు పడతారేమోనన్న భయంతో లోలోన కుమిలిపోతున్నారు. ఇదే అలుసుగా ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. కొందరు కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, కౌన్సెలింగ్‌ ఇప్పించినా.. ఉన్మాదులు వదలడం లేదు. అవకాశం కోసం ఎదురుచూసి మరీ చంపుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

ఆ వీడియో.. ఓ పాఠం!

అమ్మాయిలూ.. అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి. మొదట్లో వారు మనతో సున్నితంగా ఉండి నమ్మిస్తారు. తర్వాత ముసుగులు తొలగిస్తారు. వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారు. రెండున్నరేళ్ల కిందట వరకూ నేనూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అతనిలో తీవ్రస్థాయి ఉన్మాద మనస్తత్వాన్ని గుర్తించి ఆ బంధానికి స్వస్తి పలికి కెరీర్‌పై దృష్టి సారించాను. అది మొదలు అతని నుంచి నాకు బెదిరింపు కాల్స్‌, సందేశాలు వెల్లువెత్తాయి. నాపై దుష్ప్రచారం మొదలైంది. నన్ను ఇంజినీరింగ్‌ నుంచి డ్రాపవుట్‌ చేయించాలని చూశాడు. నేను నోరు మూసుకుని పడి ఉండేలా చేయాలనుకున్నాడు. నా కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకున్నాడు. అవన్నీ బలంగా ఎదుర్కొని బయటకు రాగలిగాను. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ఆ నరకం నుంచి బయటపడ్డాను. నాలాగా మరే అమ్మాయి ఉన్మాదుల బారిన పడకూడదనే ఈ వీడియో చేస్తున్నా.

- ప్రేమోన్మాది చేతిలో బలైపోయిన విజయవాడకు చెందిన దివ్యతేజస్విని అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో గతంలో పోస్టు చేసిన వీడియోలోని వ్యాఖ్యలు

ఇదీ చదవండి:

నేటి నుంచే నామినేషన్లు.. ఎలాంటి ఏర్పాట్లూ చేయని జిల్లా అధికారులు

ముసుగు తొలగిన తర్వాతే..

చాలామంది అమ్మాయిలు తెలిసీ తెలియని దశలో, కౌమార వయసులో ఆకర్షణలకు లోనవుతున్నారు. అవతలి వ్యక్తి మనస్తత్వం, ప్రవర్తనపై సరైన అంచనా, అవగాహన లేకుండానే వారి వలలో చిక్కుకుంటున్నారు. యువకులు మొదట్లో సున్నితంగా ఉంటూ, మంచి మాటలతో అమ్మాయిలతో చనువు పెంచుకుంటున్నారు. కొన్నాళ్లకు వారి ముసుగు తొలగి అసలు స్వభావం బయటపడేకొద్దీ.. అమ్మాయిలు నెమ్మదిగా దూరం పెడుతున్నారు. మంచీచెడులు అర్థం చేసుకునే పరిణితి రావడం, కెరీర్‌పై దృష్టి సారించే క్రమంలో వారి ఉచ్చులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలోనే యువకుల్లోని విపరీతగుణం వెలుగుచూస్తోంది. అప్పటివరకూ తనతో బాగా మెలిగిన అమ్మాయి దూరం పెడుతుండటంతో.. కక్ష పెంచుకుంటున్నారు. ఇతరులతో చనువుగా ఉంటుందేమోనని అపోహ పడుతున్నారు. పగతో రగిలిపోతూ వేధింపులకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. చంపేయాలన్నంత కసి పెంచుకొంటున్నారు. తాను మారిపోయానంటూ, చివరిసారి మాట్లాడేందుకు బయటకు రావాలంటూ నమ్మిస్తున్నారు. తమ మధ్య సంబంధాలు బాగా ఉన్నప్పటి ఫోన్‌ సంభాషణలు, తీసుకున్న చిత్రాలు భద్రపరుచుకుని.. తాను పిలిచిన చోటుకు రాకపోతే వాటిని బయటపెడతానంటూ బెదిరిస్తున్నారు. పరువు, భయంతో బయటకొచ్చిన యువతిని.. చివరకు ఘర్షణకు దిగి చంపేస్తున్నారు.

ఆ ఆలోచనే వారికి అలుసవుతోంది...

ప్రేమోన్మాదుల వేధింపుల సమస్యను తొలుత వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనను అవతలి వారు అలుసుగా తీసుకుంటున్నారు. అమ్మాయి భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతుందనో.. పరువు పోతుందనో.. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు వెనకాడుతున్నారు. దీంతో తమను ఏమీ చేయలేరులే అనే భావనతో అవతలి వారు రెచ్చిపోతున్నారు. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారి నుంచి సత్వర స్పందన లోపిస్తోంది. ఇటీవలి ఉదంతాలే ఇందుకు తార్కాణాలు.

4 నెలలు.. 7 ఉదంతాలు

1. చిత్తూరు జిల్లాలో గాయత్రి అనే యువతిని ఢిల్లీబాబు అనే యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిరువురూ నెలన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు. పెద్దలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడికి పెళ్లి వయసు రాకపోవటంతో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు. ఆ తర్వాత నుంచి గాయత్రి మనసు మార్చుకుని తనను దూరం పెడుతోందని.. ఆమె తల్లిదండ్రుల మాటే వింటూ.. తనను తిరస్కరిస్తోందని భావించిన ఢిల్లీబాబు పగ పెంచుకుని ఉన్మాదిగా మారాడు. కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. చివరికి అతనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.

2. విజయవాడలో దారుణ హత్యకు గురైన ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్వినికి నాగేంద్రబాబు నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అతని వల్ల తన కుటుంబ సభ్యులకు ఏమైనా హాని కలుగుతుందేమోనన్న భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చివరకు ఆ యువకుడు.. యువతి ఇంట్లోకి చొరబడి గొంతు కోసి చంపేశాడు. తానూ కత్తితో గాయపరుచుకున్నాడు.

3. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో సజీవ దహనమైంది. యువకుడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరోసారి ఆమె జోలికి వెళ్లనంటూ రాసిచ్చాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే చిన్నారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హతమార్చాడు. ఆ మంటల్లో తానూ మరణించాడు.

4. విశాఖ జిల్లా గాజువాకలో అఖిల్‌సాయి అనే యువకుడు తన కుమార్తె వెంట పడుతున్నాడంటూ యువతి తండ్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి భవిష్యత్తు పాడైపోతుందంటూ నిందితుడి తండ్రి యువతి తండ్రిని బతిమాలాడు. మీ కుమార్తె జోలికి రాకుండా చూసుకుంటానని హామీ ఇవ్వటంతో యువతి తండ్రి ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయినా ఆ ప్రేమోన్మాది ఆమె గొంతుకోసి హతమార్చాడు.

5. ఇదే జిల్లాలో వార్డు వాలంటీరుగా పనిచేస్తున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో శ్రీకాంత్‌ అనే యువకుడు ఆమె ఇంటికెళ్లి మరీ గొంతు కోశాడు. తానూ గాయపరచుకున్నాడు. ఆసుపత్రిలో చేర్చడంతో బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది.

6. అనంతపురం జిల్లాలో ఇటీవల హత్యకు గురైన స్నేహలత తల్లిదండ్రులు.. రాజేశ్‌ అనే యువకుడి వేధింపులపై గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌ కూడా వారుంటున్న కాలనీవాసే కావటంతో.. ‘మీరు అక్కడి నుంచి ఇల్లు మారితే సమస్య ఉండదు కదా’ అంటూ పోలీసులు సలహా ఇచ్చారు. చివరకు ప్రేమోన్మాదిగా మారిన రాజేశ్‌.. స్నేహలత గొంతు నులిమి చంపేశాడు

7. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ఉన్మాది.. తనను ప్రేమించలేదని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటనలో ఆమె ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపోగా తల, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చెర నుంచి బయటకొచ్చినా...

ప్రేమ పేరిట వేధింపులు ఎదుర్కొంటున్న అమ్మాయిల్లో కొందరు మాత్రమే ఆ విషయాన్ని కుటంబ సభ్యులతో చెప్పగలుగుతున్నారు. ఇంట్లో తెలిస్తే తమనే తప్పు పడతారేమోనన్న భయంతో లోలోన కుమిలిపోతున్నారు. ఇదే అలుసుగా ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. కొందరు కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, కౌన్సెలింగ్‌ ఇప్పించినా.. ఉన్మాదులు వదలడం లేదు. అవకాశం కోసం ఎదురుచూసి మరీ చంపుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

ఆ వీడియో.. ఓ పాఠం!

అమ్మాయిలూ.. అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి. మొదట్లో వారు మనతో సున్నితంగా ఉండి నమ్మిస్తారు. తర్వాత ముసుగులు తొలగిస్తారు. వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారు. రెండున్నరేళ్ల కిందట వరకూ నేనూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అతనిలో తీవ్రస్థాయి ఉన్మాద మనస్తత్వాన్ని గుర్తించి ఆ బంధానికి స్వస్తి పలికి కెరీర్‌పై దృష్టి సారించాను. అది మొదలు అతని నుంచి నాకు బెదిరింపు కాల్స్‌, సందేశాలు వెల్లువెత్తాయి. నాపై దుష్ప్రచారం మొదలైంది. నన్ను ఇంజినీరింగ్‌ నుంచి డ్రాపవుట్‌ చేయించాలని చూశాడు. నేను నోరు మూసుకుని పడి ఉండేలా చేయాలనుకున్నాడు. నా కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకున్నాడు. అవన్నీ బలంగా ఎదుర్కొని బయటకు రాగలిగాను. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ఆ నరకం నుంచి బయటపడ్డాను. నాలాగా మరే అమ్మాయి ఉన్మాదుల బారిన పడకూడదనే ఈ వీడియో చేస్తున్నా.

- ప్రేమోన్మాది చేతిలో బలైపోయిన విజయవాడకు చెందిన దివ్యతేజస్విని అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో గతంలో పోస్టు చేసిన వీడియోలోని వ్యాఖ్యలు

ఇదీ చదవండి:

నేటి నుంచే నామినేషన్లు.. ఎలాంటి ఏర్పాట్లూ చేయని జిల్లా అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.