ETV Bharat / city

కొత్త విద్యావిధానాన్ని వ్యతిరేకించిన ఏపీ పేరెంట్స్​ అసోసియేషన్

author img

By

Published : Jul 29, 2021, 6:26 PM IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానాన్ని ఏపీ పాఠశాల పేరెంట్స్​ అసోసియేషన్​ వ్యతిరేకించింది. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే కొత్త విద్యావిధానం అమలుపై ఆలోచించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.

ap-parents-association
ఏపీ పేరెంట్స్​ అసోసియేషన్

నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సమగ్ర అధ్యయనం తర్వాతనే నూతన జాతీయ విద్యా విధానం అమలుకు మొగ్గు చూపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

నూతన విద్యా విధానంతో నిరుద్యోగ సమస్య ప్రబలడంతోపాటు ఉపాధ్యాయ నియామకాలకు గండి పడే అవకాశం ఉందని అప్పా ప్రతినిధులు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ సారథ్యంలో పలు ఉపాధ్యాయ అసోసియేషన్స్ విజయవాడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్బంగా అప్పా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రం నూతనంగా అమలుచేయునున్న జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

మోదీ సర్కార్.. విద్యా విధానం వల్ల.. చిన్న, ఓ మాదిరి ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలలకు నూతన విద్యా విధానం శాపంలా మారనున్నదని వాపోయారు.

ప్రభుత్వ బడులలను సంరక్షిచాల్సిన బాధ్యత జగన్ సర్కార్ పై ఉందని... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా నూతన విద్యా విధానం'

నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సమగ్ర అధ్యయనం తర్వాతనే నూతన జాతీయ విద్యా విధానం అమలుకు మొగ్గు చూపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

నూతన విద్యా విధానంతో నిరుద్యోగ సమస్య ప్రబలడంతోపాటు ఉపాధ్యాయ నియామకాలకు గండి పడే అవకాశం ఉందని అప్పా ప్రతినిధులు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ సారథ్యంలో పలు ఉపాధ్యాయ అసోసియేషన్స్ విజయవాడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్బంగా అప్పా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రం నూతనంగా అమలుచేయునున్న జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

మోదీ సర్కార్.. విద్యా విధానం వల్ల.. చిన్న, ఓ మాదిరి ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలలకు నూతన విద్యా విధానం శాపంలా మారనున్నదని వాపోయారు.

ప్రభుత్వ బడులలను సంరక్షిచాల్సిన బాధ్యత జగన్ సర్కార్ పై ఉందని... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా నూతన విద్యా విధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.