ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 199 కొవిడ్ కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Jan 9, 2021, 6:36 PM IST

కొత్తగా 199 మంది రాష్ట్రంలో కరోనా బారిన పడ్డారని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 423 మందికి కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. తాజా కేసులతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,84,689కి చేరింది.

ap covid bulletin on 09.01.2021
ఏపీ కరోనా బులెటిన్ 09.01.2021

గత 24 గంటల్లో 50,445 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 423 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 35 మంది.. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. చిత్తూరులో 23, విశాఖపట్నం 21, తూర్పు గోదావరిలో 20, అనంతపురంలో 15, పశ్చిమ గోదావరిలో 14, కర్నూలులో 12, నెల్లూరులో 11, కడపలో 7 చొప్పున కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,22,74,647 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజా కేసులతో కలిపి 8,84,689 మందికి కొవిడ్ సోకింది. 8,74,954 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 2,607 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,128 మంది మహమ్మారి వల్ల మరణించారు.

గత 24 గంటల్లో 50,445 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 423 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 35 మంది.. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. చిత్తూరులో 23, విశాఖపట్నం 21, తూర్పు గోదావరిలో 20, అనంతపురంలో 15, పశ్చిమ గోదావరిలో 14, కర్నూలులో 12, నెల్లూరులో 11, కడపలో 7 చొప్పున కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,22,74,647 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజా కేసులతో కలిపి 8,84,689 మందికి కొవిడ్ సోకింది. 8,74,954 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 2,607 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,128 మంది మహమ్మారి వల్ల మరణించారు.

ap covid bulletin on 09.01.2021
ఏపీ కరోనా బులెటిన్ 09.01.2021

ఇదీ చదవండి:

కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.