'అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలి' - విజయవాడలో అమరావతి ఆందోళనలు
మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన ఆడపడుచులను.. రోడ్డుపైకి లాగిన వైకాపా ప్రభుత్వం మాకొద్దు అంటూ.. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేసి మహిళలకు కానుక ఇవ్వాలని కోరారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో రైతులు, యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు.