అమరావతి - అనంతపురం ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ కింద 100 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనానుమతులు జారీ చేసింది. ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగానూ జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారికి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలిచ్చింది.భూసేకరణకు మొత్తంగా 2230 కోట్ల మేర ఖర్చవుతుందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారాన్ని తెలియచేసింది. అదనంగా చేసే భూసేకరణ ఖర్చులో 50శాతం మేర భరించేందుకు కూడా సమ్మతించింది. ఈ మేరకు రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీచదవండి