ETV Bharat / city

రూ.765 కోట్ల 'ఉపాధి హామీ' నిధులు విడుదల - ఉపాధి హామీ పనులపై మంత్రిపెద్దిరెడ్డి వార్తలు

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు సంబంధించిన రూ.765.85 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కూలీలకు చెల్లింపుల విషయమై ఎలాంటి కొరత ఉండదన్నారు.

765 crores nregs fund released to ap govt
765 crores nregs fund released to ap govt
author img

By

Published : Jun 5, 2020, 4:15 AM IST

ఉపాధి హామీ పథకానికి సంబంధించి.. గతంలో విడుదల చేసిన 2 వేల 148 కోట్ల నిధులు జూన్ 2, 2020 వరకు పని చేసిన కూలీల చెల్లింపులకు సరిపోయాయని.. ప్రస్తుతం విడుదల చేసిన రూ.765.85 కోట్ల రూపాయలు ఈ సీజన్​లో పని చేసిన కూలీల చెల్లింపులకు సరిపోతాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉపాధి హామీ కూలీలకు ఇది ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. కరోనాపై కూలీలకు అవగాహన కల్పిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. నిధులకు ఎలాంటి కొరత లేనందున నిరాటంకంగా కూలీలకు పనులు ఇవ్వాలని అధికారులను పెద్దిరెడ్డి ఆదేశించారు.

ఉపాధి హామీ పథకానికి సంబంధించి.. గతంలో విడుదల చేసిన 2 వేల 148 కోట్ల నిధులు జూన్ 2, 2020 వరకు పని చేసిన కూలీల చెల్లింపులకు సరిపోయాయని.. ప్రస్తుతం విడుదల చేసిన రూ.765.85 కోట్ల రూపాయలు ఈ సీజన్​లో పని చేసిన కూలీల చెల్లింపులకు సరిపోతాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉపాధి హామీ కూలీలకు ఇది ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. కరోనాపై కూలీలకు అవగాహన కల్పిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. నిధులకు ఎలాంటి కొరత లేనందున నిరాటంకంగా కూలీలకు పనులు ఇవ్వాలని అధికారులను పెద్దిరెడ్డి ఆదేశించారు.

ఇదీ చదవండి: భారత్​కు సాయం కోసం.. బుజ్జి ఎన్​ఆర్​ఐ సాహసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.