కరోనా ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుమల కొండపై కర్ఫ్యూ వాతావరణం కనపడుతోంది. 15 నిమిషాల్లోనే స్వామివారి దర్శనం పూర్తవుతోంది. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులు కొనుగోలు చేయడం లేదు. మహాద్వారం వద్ద భక్తులు లేక క్యూలైన్లు అప్పుడప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 8 వేల మంది భక్తులు మాత్రమే వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: శ్రీవారికి హర్ష టయోటా వాహనం విరాళం