ETV Bharat / city

జ‌న‌వ‌రి 15 న తితిదే ఆధ్వర్యంలో.. మ‌న‌గుడి - గోపూజ ప్రారంభం

author img

By

Published : Jan 7, 2021, 7:31 AM IST

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జనవరి 15న మన గుడి - గోపూజ కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సకలప్రాణకోటికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగాలని తిరుపతిలో అకాలమృత్యుహరణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ నెల 20 వరకు మహాయజ్ఞం జరగునుంది.

ttd will be hosting the managudi-gopuja program
మ‌న‌గుడి - గోపూజ‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్న తీతీదే

హిందూ ధ‌ర్మ ‌ప్ర‌చారంలో భాగంగా జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి క‌నుమ పర్వదినాన మనగుడి - గోపూజ కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు చెన్నై, బెంగ‌ళూరు, గురువాయూరులోనూ గోపూజ కార్య‌క్ర‌మం నిర్వహించనున్నట్లు తీతీదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆల‌యాల్లో గోవుకు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ, ధార్మికోప‌న్యాసం నిర్వ‌హించి భ‌క్తుల‌కు ప్ర‌సాదం పంపిణీ చేయనున్నారు.

అకాల‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం

విశ్వంలోని స‌క‌ల‌ప్రాణికోటికి మృత్యు భ‌యం తొల‌గి ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని తిరుప‌తిలోని క‌పిల‌తీర్థం ఆలయ ప్రాంగ‌ణంలో తీతీదే అకాల‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం నిర్వహిస్తోంది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు మహాయజ్ఞం జరగనుంది. త‌మిళ‌నాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 51 మంది కృష్ణ‌య‌జుర్వేద పండితులు, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆచార్యులు ఈ మ‌హాయ‌జ్ఞాన్ని నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 9 నుంచి 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు ఈ య‌జ్ఞం జ‌రుగుతోంది.

హిందూ ధ‌ర్మ ‌ప్ర‌చారంలో భాగంగా జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి క‌నుమ పర్వదినాన మనగుడి - గోపూజ కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు చెన్నై, బెంగ‌ళూరు, గురువాయూరులోనూ గోపూజ కార్య‌క్ర‌మం నిర్వహించనున్నట్లు తీతీదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆల‌యాల్లో గోవుకు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ, ధార్మికోప‌న్యాసం నిర్వ‌హించి భ‌క్తుల‌కు ప్ర‌సాదం పంపిణీ చేయనున్నారు.

అకాల‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం

విశ్వంలోని స‌క‌ల‌ప్రాణికోటికి మృత్యు భ‌యం తొల‌గి ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని తిరుప‌తిలోని క‌పిల‌తీర్థం ఆలయ ప్రాంగ‌ణంలో తీతీదే అకాల‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం నిర్వహిస్తోంది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు మహాయజ్ఞం జరగనుంది. త‌మిళ‌నాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 51 మంది కృష్ణ‌య‌జుర్వేద పండితులు, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆచార్యులు ఈ మ‌హాయ‌జ్ఞాన్ని నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 9 నుంచి 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు ఈ య‌జ్ఞం జ‌రుగుతోంది.

ఇదీ చదవండి:

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్‌ దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.