ETV Bharat / city

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీపై భక్తుల నిరసన - తిరుపతి గరుడ కూడలిలో శ్రీవారి భక్తుల ఆందోళన

ముందస్తు ప్రకటన లేకుండా సర్వదర్శన టోకెన్లు జారీ చేయడంపై శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. తిరుపతిలోని గరుడ కూడలిలో బైఠాయించి.. నిరసన తెలిపారు. దూర ప్రాంతాల భక్తులు.. దర్శన భాగ్యం కలుగకుండానే వెళ్లిపోవాల్సి వస్తోందని మండిపడ్డారు.

piligrims protest
ఆందోళన చేస్తున్న భక్తులు
author img

By

Published : Dec 22, 2020, 4:12 PM IST

ఆందోళన చేస్తున్న భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని కోరుతూ.. వివిధ ప్రాంతాల భక్తులు తిరుపతి గరుడ కూడలిలో ఆందోళనకు దిగారు. ముందస్తు ప్రకటనలు లేకుండా టోకెన్లు జారీ చేయడాన్ని భక్తులు తప్పుపట్టారు. దూరప్రాంతాల భక్తులు శ్రీవారిని దర్శించుకోకుండా వెనుదిరగాల్సి వస్తోందని నినాదాలు చేశారు. తితిదే ధర్మకర్తల మండలి కలుగజేసుకొని సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న తితిదే.. ఈ నెల 24వ తేదీ వరకు సరిపడా సర్వదర్శన టోకెన్లను మూడు రోజులు ముందుగానే జారీ చేసింది. అనంతరం ఆ టోకెన్లు ఇచ్చే కేంద్రాలను మూసివేసివేయడం భక్తలకు ఆగ్రహానికి కారణమైంది.

ఇదీ చదవండి:

తిరుమలకు చీఫ్‌ విప్‌ పాదయాత్ర.. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో చిత్రీకరణ

ఆందోళన చేస్తున్న భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని కోరుతూ.. వివిధ ప్రాంతాల భక్తులు తిరుపతి గరుడ కూడలిలో ఆందోళనకు దిగారు. ముందస్తు ప్రకటనలు లేకుండా టోకెన్లు జారీ చేయడాన్ని భక్తులు తప్పుపట్టారు. దూరప్రాంతాల భక్తులు శ్రీవారిని దర్శించుకోకుండా వెనుదిరగాల్సి వస్తోందని నినాదాలు చేశారు. తితిదే ధర్మకర్తల మండలి కలుగజేసుకొని సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న తితిదే.. ఈ నెల 24వ తేదీ వరకు సరిపడా సర్వదర్శన టోకెన్లను మూడు రోజులు ముందుగానే జారీ చేసింది. అనంతరం ఆ టోకెన్లు ఇచ్చే కేంద్రాలను మూసివేసివేయడం భక్తలకు ఆగ్రహానికి కారణమైంది.

ఇదీ చదవండి:

తిరుమలకు చీఫ్‌ విప్‌ పాదయాత్ర.. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో చిత్రీకరణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.