ETV Bharat / city

తిరుపతి రైల్వే స్టేషన్​ను సందర్శించిన ద.మ.రైల్వే జీఎం - గజానన్​ మాల్యా వార్తలు

తిరుపతి రైల్వే స్టేషన్​ను ద.మ.రైల్వే జీఎం గజానన్​ మాల్యా సందర్శించారు. కొవిడ్ ఆంక్షల సడలింపు అనంతరం అందుతున్న సౌకర్యాలను ప్రయాణికులు అడిగి తెలుసుకున్నారు.

railway gm
తిరుపతి రైల్వే స్టేషన్​ను సందర్శించిన ద.మ.రైల్వే జీఎం
author img

By

Published : Feb 24, 2021, 7:13 PM IST

తిరుపతి రైల్వే స్టేషన్‌ను ద.మ రైల్వే జీఎం గజానన్​ మాల్యా సందర్శించారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కొవిడ్ ఆంక్షల అనంతరం అందుతున్న సౌకర్యాలపై జీఎం.. ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 60 శాతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పునరుద్ధరించినట్లు చెప్పిన ఆయన.. ప్రయాణికులు తప్పనిసరిగా రిజర్వేషన్ చేసుకోవాలన్నారు. ప్యాసింజర్ రైళ్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మహారాష్ట్ర, కేరళలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తిరుపతి రైల్వే స్టేషన్‌ను ద.మ రైల్వే జీఎం గజానన్​ మాల్యా సందర్శించారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కొవిడ్ ఆంక్షల అనంతరం అందుతున్న సౌకర్యాలపై జీఎం.. ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 60 శాతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పునరుద్ధరించినట్లు చెప్పిన ఆయన.. ప్రయాణికులు తప్పనిసరిగా రిజర్వేషన్ చేసుకోవాలన్నారు. ప్యాసింజర్ రైళ్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మహారాష్ట్ర, కేరళలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇదీ చదవండి: పీఎం 'కుసుమ్'.... వికసించటం లేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.