ETV Bharat / city

Reliance: తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదన విరమణ - ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ భూములు వెనక్కి వార్తలు

తిరుపతి(tirupathi) సమీపంలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం కేటాయించిన భూములను రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ)కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(reliance industries) వెనక్కి ఇచ్చేసింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌(internet) వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సంస్థ విరమించుకుంది.

lands returned to APIIC from Reliance industry
lands returned to APIIC from Reliance industry
author img

By

Published : Jun 25, 2021, 4:31 AM IST

Updated : Jun 25, 2021, 5:47 AM IST

ఏపీఐఐసీకి రిలయన్స్​ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి ఇచ్చేసింది. రిలయన్స్‌ సంస్థ భూములను వెనక్కి ఇచ్చిన విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. భూముల కోసం సంస్థ డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.

ఫలించని సంప్రదింపులు

రిలయన్స్‌ సంస్థకు గత ప్రభుత్వం 136 ఎకరాలను కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాకే అందులో 75 ఎకరాలను అప్పగించింది. రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఇలా సమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉండదు. ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు. ఇదే విషయమై సంప్రదింపులు జరిపినా సంస్థ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని ఓ అధికారి తెలిపారు. ఆ భూములనే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇటీవల కేటాయించింది.

‘సెట్‌టాప్‌ బాక్సుల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్‌ సంస్థ విరమించింది. సంస్థ అవసరాల మేరకు సెట్‌టాప్‌ బాక్సుల తయారీకి ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అధికారులు జరిపిన సంప్రదింపుల్లో వెల్లడించింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'

ఏపీఐఐసీకి రిలయన్స్​ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి ఇచ్చేసింది. రిలయన్స్‌ సంస్థ భూములను వెనక్కి ఇచ్చిన విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. భూముల కోసం సంస్థ డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.

ఫలించని సంప్రదింపులు

రిలయన్స్‌ సంస్థకు గత ప్రభుత్వం 136 ఎకరాలను కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాకే అందులో 75 ఎకరాలను అప్పగించింది. రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఇలా సమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉండదు. ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు. ఇదే విషయమై సంప్రదింపులు జరిపినా సంస్థ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని ఓ అధికారి తెలిపారు. ఆ భూములనే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇటీవల కేటాయించింది.

‘సెట్‌టాప్‌ బాక్సుల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్‌ సంస్థ విరమించింది. సంస్థ అవసరాల మేరకు సెట్‌టాప్‌ బాక్సుల తయారీకి ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అధికారులు జరిపిన సంప్రదింపుల్లో వెల్లడించింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'

Last Updated : Jun 25, 2021, 5:47 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.