ETV Bharat / city

RUYA incident: గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే రుయా ఘటన.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

author img

By

Published : Jul 13, 2021, 4:59 PM IST

Updated : Jul 14, 2021, 3:46 AM IST

గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే రుయా ఘటన జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టుకు నివేదించింది. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని చెప్పింది. అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Ruya Hospital incident
Ruya Hospital incident

ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయా ఆసుపత్రిలో కొవిడ్ బాధితులు కన్నుమూ శారని చిత్తూరు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది . ఆక్సిజన్ సరఫరాలో పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం వ్యవస్థ ఆసుపత్రిలో పనిచేయలేదని వివరించింది . కలెక్టర్ ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచామని ప్రభుత్వ న్యాయవాది టి.బాలస్వామి తెలిపారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. అఫిడవిట్ వేయాలని ఆదేశించింది . విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది .

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 40 మందికి పైగా కొవిడ్ బాధితులు కన్నుమూశారని , ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు , ఆసుపత్రి యాజమాన్యపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ , తెదేపా నేత పవార్ మోహన్ రావు( సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు) హైకోర్టులో పిల్ వేశారు . బాధ్యులపై కేసు నమోదు చేయాలని అలిపిరి ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు . రుయా ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్లు కలెక్టర్ తేల్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా ఆదేశించాలని పిటీషనర్ తరపు న్యాయవాది బాలాజీ వడేరా కోరారు . విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారికి రూ.కోటి పరిహారం ఇచ్చి .. రుయా ఘటనలో కన్నుమూసిన వారికి తక్కువ పరిహారం ఇవ్వడం వివక్ష చూపడమేనన్నారు.

ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయా ఆసుపత్రిలో కొవిడ్ బాధితులు కన్నుమూ శారని చిత్తూరు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది . ఆక్సిజన్ సరఫరాలో పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం వ్యవస్థ ఆసుపత్రిలో పనిచేయలేదని వివరించింది . కలెక్టర్ ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచామని ప్రభుత్వ న్యాయవాది టి.బాలస్వామి తెలిపారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. అఫిడవిట్ వేయాలని ఆదేశించింది . విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది .

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 40 మందికి పైగా కొవిడ్ బాధితులు కన్నుమూశారని , ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు , ఆసుపత్రి యాజమాన్యపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ , తెదేపా నేత పవార్ మోహన్ రావు( సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు) హైకోర్టులో పిల్ వేశారు . బాధ్యులపై కేసు నమోదు చేయాలని అలిపిరి ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు . రుయా ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్లు కలెక్టర్ తేల్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా ఆదేశించాలని పిటీషనర్ తరపు న్యాయవాది బాలాజీ వడేరా కోరారు . విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారికి రూ.కోటి పరిహారం ఇచ్చి .. రుయా ఘటనలో కన్నుమూసిన వారికి తక్కువ పరిహారం ఇవ్వడం వివక్ష చూపడమేనన్నారు.

ఇదీ చదవండి:

CHANDRABABU: 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'

Last Updated : Jul 14, 2021, 3:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.