లాక్డౌన్తో మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ అన్నపానీయాలు దొరకట్లేదు. లాక్డౌన్ ఆరంభం నుంచీ రోడ్లపై ఆహారం దొరక్క అలమటిస్తున్న మూగజీవాలు... వేసవి దెబ్బకు అల్లాడిపోతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం... గుప్పెడు మెతుకుల కోసం అష్టకష్టాలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టి.నగర్ పరిసరాల్లో.. ఓ కుక్క మంచినీళ్ల కోసం ప్లాస్టిక్ డబ్బాలో తలదూర్చింది. మెడ లోపల ఇరుక్కుపోవటంతో ముప్పతిప్పలు పడింది. దీని అవస్థను గమనించిన పారిశుద్ధ్య కార్మికులు డబ్బాను తొలగించటంతో... బతుకు జీవుడా అంటూ పరుగులు తీసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యాపరమైన అంశాలకు ఆటోమేషన్