ETV Bharat / city

Sangam Barrage: సంగం బ్యారేజీ పేరు మారుస్తూ జీవో... ఆ పేరేంటంటే..?

author img

By

Published : Apr 14, 2022, 6:07 PM IST

Sangam Barrage name change: సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మే నెలలో బ్యారేజ్​ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేయాలని సీఎం జగన్​ ఆదేశించారు. ఇకపై సంగం బ్యారేజ్​.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజ్​గా మారుతుంది.

Sangam Barrage name change as Mekapati Goutham Reddy Barrage
సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు

Sangam Barrage name change: నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై సంగం వద్ద నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజ్​కు దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరును పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇటీవల మంత్రి మేకపాటి అకాల మరణంతో ఆయన సొంత నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ఈ బ్యారేజ్​కు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం జగన్​ తీర్మానం చేశారు.

ఈ తీర్మానం నేపథ్యంలో సంగం బ్యారేజ్ పనులను వేగవంతం చేయాలంటూ ఇటీవల అధికారులకు ఆదేశాలు అందాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల స్థితిగతుల్ని మేకపాటి గౌతం రెడ్డి తండ్రి, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల పరిశీలించారు. సంగం బ్యారేజ్​పై దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు, కుటుంబ సభ్యలు తెలిపారు. మే నెలలో బ్యారేజ్​ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేయాలని సీఎం జగన్​ ఆదేశించారు. ఇకపై సంగం బ్యారేజ్​.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజ్​గా మారుతుంది.

ఇదీ చదవండి: ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి : తితిదే ఈవో జవహర్ రెడ్డి

Sangam Barrage name change: నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై సంగం వద్ద నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజ్​కు దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరును పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇటీవల మంత్రి మేకపాటి అకాల మరణంతో ఆయన సొంత నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ఈ బ్యారేజ్​కు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం జగన్​ తీర్మానం చేశారు.

ఈ తీర్మానం నేపథ్యంలో సంగం బ్యారేజ్ పనులను వేగవంతం చేయాలంటూ ఇటీవల అధికారులకు ఆదేశాలు అందాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల స్థితిగతుల్ని మేకపాటి గౌతం రెడ్డి తండ్రి, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల పరిశీలించారు. సంగం బ్యారేజ్​పై దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు, కుటుంబ సభ్యలు తెలిపారు. మే నెలలో బ్యారేజ్​ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేయాలని సీఎం జగన్​ ఆదేశించారు. ఇకపై సంగం బ్యారేజ్​.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజ్​గా మారుతుంది.

ఇదీ చదవండి: ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి : తితిదే ఈవో జవహర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.