ETV Bharat / city

ఈనెల 25న ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి అనిల్

పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అనిల్ తెలిపారు. ఈనెల 25న మొదటి విడత కింద 15 లక్షల మందికి స్థలాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం రూ. 3 లక్షలకు ఇవ్వాలనుకున్న గృహాలను తాము ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి అన్నారు.

author img

By

Published : Dec 10, 2020, 5:41 PM IST

minister anil kumar
మంత్రి అనిల్ కుమార్

రాష్ట్రంలో ఈనెల 25న పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. మొదటి విడత కింద 15 లక్షల మందికి స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్​లో మంత్రి పర్యటించారు.

300 చదరపు అడుగుల ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నట్లు చెప్పారు. రూ. 3 లక్షలతో గత ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ఇళ్లను, తాము ఉచితంగా అందిస్తున్నామని మంత్రి అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.

రాష్ట్రంలో ఈనెల 25న పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. మొదటి విడత కింద 15 లక్షల మందికి స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్​లో మంత్రి పర్యటించారు.

300 చదరపు అడుగుల ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నట్లు చెప్పారు. రూ. 3 లక్షలతో గత ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ఇళ్లను, తాము ఉచితంగా అందిస్తున్నామని మంత్రి అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.

ఇవీ చదవండి..

వర్షాల భయం.. పూర్తిగా రాకముందే పంట కోస్తున్న రైతన్నలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.