ETV Bharat / city

ఆ ఊర్లో.. జనం కంటే కోతులే ఎక్కువ

author img

By

Published : Dec 25, 2019, 8:01 PM IST

వానరాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి మహిళలు, చిన్నారులపై దాడి చేస్తున్నాయి. గతంలో అడవుల్లో కనిపించే కోతులు ప్రస్తుతం పల్లెల్లో సంచరిస్తున్నాయి. చెట్లను నరికి వేయడం.. స్థావరాలు లేక గ్రామాల్లో ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 15 రోజుల్లో 50మందిపై కోతులు దాడి చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

monkeys
monkeys
ఆ గ్రామ ప్రజల కన్నా...కోతుల మంద ఎక్కువ

నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో కోతుల బెడదకు గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళలపై కోతుల మంద దాడి చేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో ఈ గ్రామంలో సుమారు 50 మందికి పైగా గ్రామస్తులు కోతుల దాడిలో గాయాలపాలయ్యారు.

గ్రామంలో ఉండాలంటే తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానరుల భయంతో తమ పిల్లలను స్కూలుకు పంపించడం లేదంటున్నారు. ఇంట్లో అన్నం వండాలన్నా... ఏదైనా తినాలన్నా.. కోతుల దెబ్బకు భయపడుతున్నామన్నారు. చివరికి గ్రామంలోకి కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లూ రావడం మానేశారని తెలిపారు. కోతుల బారి నుంచి తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ప్రాథమిక బోధన మాతృభాషలోనే జరగాలి: ఉపరాష్ట్రపతి

ఆ గ్రామ ప్రజల కన్నా...కోతుల మంద ఎక్కువ

నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో కోతుల బెడదకు గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళలపై కోతుల మంద దాడి చేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో ఈ గ్రామంలో సుమారు 50 మందికి పైగా గ్రామస్తులు కోతుల దాడిలో గాయాలపాలయ్యారు.

గ్రామంలో ఉండాలంటే తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానరుల భయంతో తమ పిల్లలను స్కూలుకు పంపించడం లేదంటున్నారు. ఇంట్లో అన్నం వండాలన్నా... ఏదైనా తినాలన్నా.. కోతుల దెబ్బకు భయపడుతున్నామన్నారు. చివరికి గ్రామంలోకి కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లూ రావడం మానేశారని తెలిపారు. కోతుల బారి నుంచి తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ప్రాథమిక బోధన మాతృభాషలోనే జరగాలి: ఉపరాష్ట్రపతి

Intro:Ap_nlr_11_24_Kotulu bebatsam_av_ap10061Body:కోతులు బాబోయ్ కోతులు
( ఆత్మకూరు నెల్లూరు జిల్లా )
గ్రామ ప్రజల కన్న గ్రామంలో కోతుల సంఖ్య ఎక్కువై గ్రామస్తులపై దాడులకు పాల్పడుతూ ఉండడంతో వాటి బారిన పడకుండా ఉండేందుకు వీధి లోకి రావాలంటే గుంపులుగా కలిసి కర్రలు తీసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగవలసిన దుస్థితి ఆ గ్రామ ప్రజలది.......
నెల్లూరు జిల్లా ఏ.ఎస్. పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో కోతుల బెడద కు గ్రామం వణికిపోతుంది. కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళలపై కోతుల మంద దాడి చేయడంతో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి తీవ్ర రక్త గాయాలు కావడంతో హాస్పటల్లో ఉన్నారు.. 15 రోజుల వ్యవధిలో ఇదే గ్రామంలో సుమారు 50 మందికి పైగా గ్రామస్తులు కోతుల దాడులకు గాయాలపాలయ్యారు.. ఈ కోతుల బెడద పై గ్రామస్తులు మాట్లాడుతూ.... గ్రామంలో ఉండాలంటే మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని, ఈ కోతుల దెబ్బకు క్షణక్షణం నరక యాతన అనుభవిస్తున్నామని వీటి భయంతో చిన్న పిల్లలను స్కూలుకు కూడా పంపించకుండా ఇంటి వద్దనే ఉంచుకుంటు న్నా మని ఇంట్లో అన్నం వండు కోవాలన్న, ఏమైనా తినాలన్నా, చివరికి బాత్రూం కి వెళ్లి స్నానం చేయాలన్న ఈ కోతుల దెబ్బకు భయపడి పోతున్నామని అన్నారు.. ఒంటరిగా ఎవరైనా తిరగాలన్నా కూడా ఈ కోతులతో భయపడి గుంపులుగా కలిసి కర్రలు తీసుకొని ఊర్లో తిరుగుతున్నా మని గ్రామస్తులు ఆవేదన వెళ్లబుచ్చారు.. చివరికి గ్రామంలోకి కూరగాయలు పండ్లు అమ్మే వాళ్లు కూడా రావడం మానేశారని తెలిపారు.. కోతుల మంద గ్రామ ప్రజల కన్న వీటి సంఖ్య ఎక్కువగా ఉందని గ్రామంలో వందల సంఖ్యలో కోతులు ఉండడంతో వాటి వైపు చూసినా కూడా ఆ పైబడి రక్తం వచ్చేలా కరుస్తున్నాయని వాపోయారు.. దీంతో హాస్పటల్లో చేరి చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. వెంటనే కోతుల బారి నుండి రక్షించమని వేడుకుంటున్నారు.....
బైట్స్: గ్రామస్తులు.,రెండు ఫైల్స్ గా ఉన్నాయి..
.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.