ETV Bharat / city

జ్వరాలతో అల్లాడుతున్న జనం - ఆస్పత్రులకు బారులు - నెల్లూరులో సీజనల్ జ్వరాలు

నెల్లూరు జిల్లాలో సీజనల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగీ జ్వరాలు... ప్రజలను ఆసుపత్రుల పాల్జేస్తున్నాయి. వాతావరణ మార్పులు సహా పారిశుద్ధ్యం బాగోలేక... కొన్నిచోట్ల ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున నీరసంగానే కనిపిస్తున్నారు.

fevers
author img

By

Published : Nov 8, 2019, 7:41 PM IST

జ్వరాలతో అల్లాడుతున్న జనం - ఆస్పత్రులకు బారులు

నెల్లూరు జిల్లాలో విషజ్వరాలు కోరలు చాచాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక..... డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. ఏ ఆసుపత్రిలో చూసినా... పిల్లల కేకలు, పెద్దల మూలుగులే. జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 వరకూ సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ నెలలో సుమారు 5 వేల మందికిపైగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించారు. నెల్లూరు, కావలి, గూడూరులో సుమారు 20వేల మంది ప్రైవేట్ వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు.

ఒక్క నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోనే.... జనవరి నుంచి ప్రతినెలా సగటున 200 మందికిపైగా జ్వరాలతో చికిత్స పొందారు. సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 614 మందికి పెరిగింది. అందులో 17 డెంగీ కేసులూ నమోదయ్యాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్న వారితో పోలిస్తే ఈ సంఖ్య చిన్నదేనని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత లేదని... ఎలాంటి వ్యాధికైనా మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. డెంగీ నిర్ధరణ పరీక్షలూ ఉచితంగా నిర్వహిస్తామంటున్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. పరిశుభ్రతపై జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు. నెల్లూరు ఆసుపత్రిలో మాత్రమే అన్ని సౌకర్యాలు ఉన్నందున... దూరప్రాంతాల ప్రజలు రావడానికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితి తప్పాలంటే... ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్య సదుపాయాలు పెంచాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

సినిమా పేరుతో మోసం.. మెటీరియల్ పేరుతో మహిళల అమ్మకం!

జ్వరాలతో అల్లాడుతున్న జనం - ఆస్పత్రులకు బారులు

నెల్లూరు జిల్లాలో విషజ్వరాలు కోరలు చాచాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక..... డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. ఏ ఆసుపత్రిలో చూసినా... పిల్లల కేకలు, పెద్దల మూలుగులే. జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 వరకూ సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ నెలలో సుమారు 5 వేల మందికిపైగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించారు. నెల్లూరు, కావలి, గూడూరులో సుమారు 20వేల మంది ప్రైవేట్ వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు.

ఒక్క నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోనే.... జనవరి నుంచి ప్రతినెలా సగటున 200 మందికిపైగా జ్వరాలతో చికిత్స పొందారు. సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 614 మందికి పెరిగింది. అందులో 17 డెంగీ కేసులూ నమోదయ్యాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్న వారితో పోలిస్తే ఈ సంఖ్య చిన్నదేనని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత లేదని... ఎలాంటి వ్యాధికైనా మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. డెంగీ నిర్ధరణ పరీక్షలూ ఉచితంగా నిర్వహిస్తామంటున్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. పరిశుభ్రతపై జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు. నెల్లూరు ఆసుపత్రిలో మాత్రమే అన్ని సౌకర్యాలు ఉన్నందున... దూరప్రాంతాల ప్రజలు రావడానికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితి తప్పాలంటే... ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్య సదుపాయాలు పెంచాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

సినిమా పేరుతో మోసం.. మెటీరియల్ పేరుతో మహిళల అమ్మకం!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.