కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనంపై కాకుండా నిరర్ధక ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోషియేషన్ సెక్రటరీ వీఎస్ రాంబాబు కోరారు. నెల్లూరులో నిర్వహించిన బ్యాంకు ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల్లో ఉన్న బ్యాంకులకు మూలధనం ద్వారా చేయూత అందించాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు.
'బడ్జెట్లో బ్యాంకింగ్ రంగానికి పెద్దపీట వేయాలి'
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోషియేషన్ సెక్రటరీ వీఎస్ రాంబాబు డిమాండ్ చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంకులకు చేయూత అందించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనంపై కాకుండా నిరర్ధక ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోషియేషన్ సెక్రటరీ వీఎస్ రాంబాబు కోరారు. నెల్లూరులో నిర్వహించిన బ్యాంకు ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల్లో ఉన్న బ్యాంకులకు మూలధనం ద్వారా చేయూత అందించాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు.
నెల్లూరు ఫత్తేఖాన్ పేట వద్ద గతేడాది నవంబర్లో తుపాకీతో కాల్చి వ్యాపారిని హత్య చేసిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1, ఏ2, ఏ6 అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, శుక్రవారం రాత్రి ఏ6 షేక్ సలీం రసీదును పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్లో రాజ్ పురోహిత్ మహేంద్ర సింగ్ అనే వ్యాపారిని తుపాకీతో కాల్చి నిందితులు పరారయ్యారు. అప్పట్లో ఈ విషయం కలకలం సృష్టించడంతో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇంకా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండటంతో వారిని త్వరలోనే పట్టుకుంటామని నెల్లూరు నగర డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ లోని ఓ భాగాన్ని, మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బైట్: మురళి కృష్ణ, నెల్లూరు నగర డిఎస్పీ.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291