ETV Bharat / city

కర్నూలులో తందూరి ఛాయ్...ఆస్వాదిస్తున్న జనం - pot tea makini in kurnool

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే విభిన్నంగా ఆలోచించాల్సిందే. లేదంటే నష్టాల బాట పట్టి దుకాణం సర్దుకోవాల్సిందే. ఈ విషయాన్ని గ్రహించిన కర్నూలు వాసి... అటు పర్యావరణానికి హాని లేకుండా...ఇటు ప్రజలకు వెరై'టీ' అందిస్తున్నాడు.

tandoori tea making in kurnool district
కర్నూలులో తందూరి ఛాయ్ పరిచయం...ఆస్వాదిస్తున్న జనం
author img

By

Published : Jan 11, 2020, 10:26 AM IST

కర్నూలులో తందూరి ఛాయ్ పరిచయం...ఆస్వాదిస్తున్న జనం

కర్నూలులో శ్రీశైలం అనే వ్యక్తి టీ దుకాణం పెట్టాలనుకున్నాడు. ప్రస్తుతం వీధికొక ఛాయ్ దుకాణం ఉంది. వాళ్లందరిని కాదని... ఛాయ్ ప్రియులు తన వద్దకు రావాలంటే ఏదో ఒక వెరై'టీ' ఉండాల్సిందే అనుకున్నాడు. అదే సమయంలో రకరకాల 'టీ'ల గురించి తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో విక్రయించే తందూరీ ఛాయ్ గురించి ఆరా తీశాడు. దాన్ని కర్నూలు వాసులకు పరిచయం చేశాడు.

వైరై'టీ'తో జనం బారులు...
సాధారణంగా 'టీ' ని ప్లాస్టిక్, పేపర్, గాజు గ్లాసులో తాగడం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం నిప్పులపై కాల్చిన మట్టికుండలో 'టీ'ని దమ్ చేసి మట్టి గ్లాసుల్లో పోసి అందిస్తారు. తక్కువ రేటు... వెరైటీ రుచిని కలిగి ఉండటంతో ఛాయ్ ప్రియులు సైతం దుకాణానికి బారులు తీరుతున్నారు. పది రూపాయలకే దొరికే ఈ'టీ'ని... పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కప్పులో కాకుండా పర్యావరణ హిత మట్టి కప్పులో ఇస్తుండటంతో ఛాయ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా... ప్లాస్టిక్​ను వినియోగం తగ్గించే క్రమంలో ఈ ప్రయత్నం చేశానని దుకాణం నిర్వహకుడు చెబుతున్నాడు.

ఇవీ చూడండి-పక్షికింత ధాన్యం.. గురువుకు అంకింతం..!

కర్నూలులో తందూరి ఛాయ్ పరిచయం...ఆస్వాదిస్తున్న జనం

కర్నూలులో శ్రీశైలం అనే వ్యక్తి టీ దుకాణం పెట్టాలనుకున్నాడు. ప్రస్తుతం వీధికొక ఛాయ్ దుకాణం ఉంది. వాళ్లందరిని కాదని... ఛాయ్ ప్రియులు తన వద్దకు రావాలంటే ఏదో ఒక వెరై'టీ' ఉండాల్సిందే అనుకున్నాడు. అదే సమయంలో రకరకాల 'టీ'ల గురించి తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో విక్రయించే తందూరీ ఛాయ్ గురించి ఆరా తీశాడు. దాన్ని కర్నూలు వాసులకు పరిచయం చేశాడు.

వైరై'టీ'తో జనం బారులు...
సాధారణంగా 'టీ' ని ప్లాస్టిక్, పేపర్, గాజు గ్లాసులో తాగడం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం నిప్పులపై కాల్చిన మట్టికుండలో 'టీ'ని దమ్ చేసి మట్టి గ్లాసుల్లో పోసి అందిస్తారు. తక్కువ రేటు... వెరైటీ రుచిని కలిగి ఉండటంతో ఛాయ్ ప్రియులు సైతం దుకాణానికి బారులు తీరుతున్నారు. పది రూపాయలకే దొరికే ఈ'టీ'ని... పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కప్పులో కాకుండా పర్యావరణ హిత మట్టి కప్పులో ఇస్తుండటంతో ఛాయ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా... ప్లాస్టిక్​ను వినియోగం తగ్గించే క్రమంలో ఈ ప్రయత్నం చేశానని దుకాణం నిర్వహకుడు చెబుతున్నాడు.

ఇవీ చూడండి-పక్షికింత ధాన్యం.. గురువుకు అంకింతం..!

Intro:ap_knl_14_08_vo_spl_tea_pkg_ap10056

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే కాస్త భిన్నంగా ఆలోచించాలి కర్నూలుకు చెందిన శ్రీశైలం అనే వ్యక్తి టి దుకాణం పెట్టాలని అనుకున్న సమయంలో టీ లో వెరైటీలను తెలుసుకున్నాడు ఈ క్రమంలో రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో విక్రయించే తందురీ చాయ్ ని కర్నూల్ వాసులకు పరిచయం చేశాడు తందూరి చికెన్ తెలుసు కాని....తందూరి చాయ్ ఏంటని అనుకుంటున్నారా అయితే ఈ కథనం చూడండి....

వాయిస్ ఓవర్. కర్నూలుకు చెందిన శ్రీశైలం అనే వ్యక్తి నగరవాసులకు కొత్తరకం చాయ్ ని పరిచయం చేశాడు సాధారణంగా టీ ని ప్లాస్టిక్, పేపర్, గాజు గ్లాసులో త్రాగడం చూస్తుంటాము ఇక్కడ మాత్రం నిప్పులపై కాల్చిన మట్టికుండలో టి ని దమ్ చేసి మట్టి గ్లాసుల్లో పోసి అందిస్తుండటంతో ఛాయ్ ప్రియులు ప్రత్యేక రుచిని ఆస్వాదిస్తారు కేవలం పది రూపాయలకే ప్రత్యేకంగా తయారు చేసి ఎలాంటి హాని కలగని కప్పులో ఇస్తుండడంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
బైట్స్... నగరవాసులు.
శ్రీశైలం. నిర్వహకుడు.
ఎండ్ వాయిస్ ఓవర్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే క్రమంలో ఈ ప్రయత్నం చేశానని నిర్వాహకుడు అంటున్నారు


Body:ap_knl_14_08_vo_spl_tea_pkg_ap10056


Conclusion:ap_knl_14_08_vo_spl_tea_pkg_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.