కర్నూలు వ్యవసాయ మార్కెట్ విభజన వద్దంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ను రెండుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ను విడుదల చేయడంతో కార్మికులు ధర్నాకు దిగారు. రాజకీయ నాయకుల ప్రాబల్యం, పదవుల కోసమే జీవో విడుదల చేశారని వారు ఆరోపించారు.
జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మార్కెట్లను ఏర్పాటుచేసి.. పాణ్యం నియెజకవర్గంలోని మార్కెట్ను ఓర్వకల్లులో ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ సందర్భంగా తాజాగా తెచ్చిన జీవో రద్దు కోరుతూ నాయకులు మార్కెట్ యార్ట్ కార్యదర్శి జయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి: