కడప శివారులోని రామకృష్ణ నగర్ లో శుక్రవాపం సీపీఎం బృందం పర్యటించింది. ఆ కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం శివారు ప్రాంతాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. కాలనీ ఏర్పడి 20 ఏళ్లైనా నేటికీ పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. 5 వేల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో సరైన మురుగు కాలువలు, రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నివాసాల మధ్య పందులు సంచరిస్తున్నారు. అధికారులు స్పందించి రామకృష్ణ నగర్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి: వానోస్తే కదిలి..వెలిశాక వదిలి!