ETV Bharat / city

BADVEL BYPOLL: బద్వేల్​ ఉప ఎన్నిక...281 పోలింగ్​ కేంద్రాలు..2వేల మంది పోలీసులతో భద్రత

author img

By

Published : Oct 28, 2021, 8:50 AM IST

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికల ప్రచారానికి తెరపడింది(badvel bypoll campgian). 20 రోజులుగా హోరెత్తిన పార్టీల ప్రసంగాలు..బుధవారం సాయంత్రం 7 గంటలతో మూగబోయాయి. ఈనెల 30న జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు అధికారులు(arrangements for Badvel by poll) ప్రకటించారు. రెండు వేల మంది పోలీసులు, 15 ప్లటూన్ల పారామిలటరీ దళాల భద్రత మధ్య ఎన్నికలు జరగనున్నాయి. సుమారు రెండు లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

బద్వేల్​ ఉప ఎన్నికకు 281 పోలింగ్ కేంద్రాలు
బద్వేల్​ ఉప ఎన్నికకు 281 పోలింగ్ కేంద్రాలు
బద్వేల్​ ఉప ఎన్నిక ఏర్పాట్లు ముమ్మరం

కడప జిల్లా బద్వేల్​లో బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగిసింది. 72 గంటల ముందే ప్రచారానికి తెరపడింది. ఈనెల 30న జరిగే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్(arrangements for Badvel by poll) జరగనుంది. బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 2 లక్షల 15 వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 148 అత్యంత సమస్యాత్మక, 52 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈవీఎం(EVM) ల ద్వారా జరిగే ఎన్నికల కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు(Badvel by-election) చేశారు. 11 వందల 24 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈనెల 29న ఎన్నికల సామగ్రి, ఈవీఎం బ్యాలెట్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు.

నియోజకవర్గంలో భద్రత, పోలింగ్‌పై..రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ పోలీసులకు సూచనలు(Badvel by-election arrangements ) ఇచ్చారు. ప్రచారం ముగిసిన వెంటనే నియోజకవర్గంలో బయటి వ్యక్తులు ఉండకూడదంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు కలెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా నియోజకవర్గం పరిధిలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 2 వేలమంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరు కాకుండా ఇప్పటికే 15 ప్లటూన్ల పారా మిలటరీ దళాలు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకున్నాయని(Badvel by-election arrangements ) వివరించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా గొడవలు జరిగితే సంబంధిత వ్యక్తులపై రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు.

బరిలో 15 మంది..
బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో.. అత్యధికంగా ఈసారే 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానానికి చివరిసారిగా 2001లో ఉప ఎన్నిక నిర్వహించగా.. అప్పుడు 14 మంది పోటీలో నిలిచారు. అనంతరం 2004లో ఆరుగురు, 2009లో 12 మంది, 2014లో 13 మంది, 2019లో 14 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.

ఉపఎన్నిక బరిలో నిలిచిన 15 మంది అభ్యర్థుల్లో 41-50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 30-40 ఏళ్ల మధ్య అయిదుగురు, 41-50 ఏళ్ల మధ్య ఆరుగురు, 51-60 ఏళ్ల మధ్య ఇద్దరు, 60-65 ఏళ్ల మధ్య ఇద్దరు ఉన్నారు. అత్యధికంగా 65 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి కమలమ్మ, నవరంగ్‌ కాంగ్రెస్‌ నుంచి సింగమల వెంకటేశ్వర్లు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి జె.రాజేష్‌ (33) అతి చిన్న వయస్కుడిగా ఉన్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను ప్రకటించడంతో సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ మంది అభ్యర్థులు తుది పోటీలో ఉంటారని చాలామంది భావించారు. అయితే.. అందుకు విరుద్ధంగా గత 20 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతమే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం.

ఇదీ చదవండి..

Badvel bypoll: ముగిసిన ప్రచారం.. బయటి వ్యక్తులు ఉండొద్దని ఈసీ ఆదేశాలు

బద్వేల్​ ఉప ఎన్నిక ఏర్పాట్లు ముమ్మరం

కడప జిల్లా బద్వేల్​లో బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగిసింది. 72 గంటల ముందే ప్రచారానికి తెరపడింది. ఈనెల 30న జరిగే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్(arrangements for Badvel by poll) జరగనుంది. బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 2 లక్షల 15 వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 148 అత్యంత సమస్యాత్మక, 52 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈవీఎం(EVM) ల ద్వారా జరిగే ఎన్నికల కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు(Badvel by-election) చేశారు. 11 వందల 24 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈనెల 29న ఎన్నికల సామగ్రి, ఈవీఎం బ్యాలెట్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు.

నియోజకవర్గంలో భద్రత, పోలింగ్‌పై..రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ పోలీసులకు సూచనలు(Badvel by-election arrangements ) ఇచ్చారు. ప్రచారం ముగిసిన వెంటనే నియోజకవర్గంలో బయటి వ్యక్తులు ఉండకూడదంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు కలెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా నియోజకవర్గం పరిధిలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 2 వేలమంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరు కాకుండా ఇప్పటికే 15 ప్లటూన్ల పారా మిలటరీ దళాలు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకున్నాయని(Badvel by-election arrangements ) వివరించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా గొడవలు జరిగితే సంబంధిత వ్యక్తులపై రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు.

బరిలో 15 మంది..
బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో.. అత్యధికంగా ఈసారే 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానానికి చివరిసారిగా 2001లో ఉప ఎన్నిక నిర్వహించగా.. అప్పుడు 14 మంది పోటీలో నిలిచారు. అనంతరం 2004లో ఆరుగురు, 2009లో 12 మంది, 2014లో 13 మంది, 2019లో 14 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.

ఉపఎన్నిక బరిలో నిలిచిన 15 మంది అభ్యర్థుల్లో 41-50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 30-40 ఏళ్ల మధ్య అయిదుగురు, 41-50 ఏళ్ల మధ్య ఆరుగురు, 51-60 ఏళ్ల మధ్య ఇద్దరు, 60-65 ఏళ్ల మధ్య ఇద్దరు ఉన్నారు. అత్యధికంగా 65 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి కమలమ్మ, నవరంగ్‌ కాంగ్రెస్‌ నుంచి సింగమల వెంకటేశ్వర్లు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి జె.రాజేష్‌ (33) అతి చిన్న వయస్కుడిగా ఉన్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను ప్రకటించడంతో సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ మంది అభ్యర్థులు తుది పోటీలో ఉంటారని చాలామంది భావించారు. అయితే.. అందుకు విరుద్ధంగా గత 20 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతమే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం.

ఇదీ చదవండి..

Badvel bypoll: ముగిసిన ప్రచారం.. బయటి వ్యక్తులు ఉండొద్దని ఈసీ ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.