జ్యోతిరావు పూలేను అవమానపరిచేలా(YSRCP banners across the statue of Mahatma Jyotirao Phule).. వైకాపా నేతలు వ్యహరిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు మేయర్ పుట్టినరోజు సందర్భంగా.. పూలే విగ్రహం వద్ద మేయర్ కట్ ఔట్ ఏర్పాటు చేసి.. దారి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడికి వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణారావుకు.. ఈ కటౌట్ల గురించి బీసీ సంక్షేమ సంఘం నాయకులు వివరించారు. బీసీలను అవమానించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని.. కటౌట్లని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: cm jagan tributes to jyothirao pule: జ్యోతిరావు పూలే నమ్మిన మార్గం అదే : సీఎం జగన్