ETV Bharat / city

బ్యాంకు నుంచి తీసిన కొంతసేపటికే నగదు చోరీ

author img

By

Published : Oct 23, 2020, 5:49 AM IST

గుంటూరులో పట్టపగలే బ్యాంకు వద్ద చోరీ జరిగింది. బ్యాంకు నుంచి డ్రా చేసిన 2 లక్షల రూపాయలను దుండగులు అపహరించారని బాధితుడు తెలిపాడు. తెలిసిన వారితో బాధితుడు మాట్లాడి వచ్చే కొద్దిసేపట్లోనే నగదు దోచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

theft in guntur
గుంటూరులో దొంగతనం

బ్యాంకులో నగదు డ్రా చేసి బయటకొచ్చిన కొద్దిసేపటికే రెండు లక్షలను కాజేశారు కిలాడీలు. గుంటూరులోని చంద్రమౌళినగర్​కు చెందిన వంశీకృష్ణ తన డబ్బు పోయిందంటూ గురువారం పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు మేరకు... స్థానిక కెనరా బ్యాంకు నుంచి గురువారం మధ్యాహ్నం వంశీకృష్ణ 2 లక్షల రూపాయలు డ్రా చేశాడు. బయటకు వచ్చి నగదును ద్విచక్ర వాహన డిక్కీలో పెట్టాడు. ఇంతలో తెలిసిన వారు కనపడగా మాట్లాడుతున్నాడు. తిరిగి వాహనం వద్దకు రాగా.. డిక్కీ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి చూడగా నగదు లేదని బాధితుడు చెప్పాడు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.

బ్యాంకులో నగదు డ్రా చేసి బయటకొచ్చిన కొద్దిసేపటికే రెండు లక్షలను కాజేశారు కిలాడీలు. గుంటూరులోని చంద్రమౌళినగర్​కు చెందిన వంశీకృష్ణ తన డబ్బు పోయిందంటూ గురువారం పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు మేరకు... స్థానిక కెనరా బ్యాంకు నుంచి గురువారం మధ్యాహ్నం వంశీకృష్ణ 2 లక్షల రూపాయలు డ్రా చేశాడు. బయటకు వచ్చి నగదును ద్విచక్ర వాహన డిక్కీలో పెట్టాడు. ఇంతలో తెలిసిన వారు కనపడగా మాట్లాడుతున్నాడు. తిరిగి వాహనం వద్దకు రాగా.. డిక్కీ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి చూడగా నగదు లేదని బాధితుడు చెప్పాడు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: 'ఎన్నికల పెట్టుబడిగా భావించి ఇప్పుడు ఖర్చు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.